పాలసంద్రం..!
లక్ష్మీదేవితో వెైకుంఠవాసుడు పాలకడలిలో... శేషశయనం సతి సేవలను పొందాడని మనం పురాణాల్లో విన్నాం. అయితే.. అలాంటి పాలకడలిని భూలోకంలోనే మనం దర్శిస్తే..! ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇదీ ముమ్మాటికీ నిజం.. అచ్చంగా అలాంటి పాలకడలిని తలపించే... జలపాతం ఒకటి గోవాలో ఉంది. ఈ పాలకడలి పేరు కూడా ‘దూద్సాగర్ ఫాల్స్’ కావడం విశేషం.

ఈ జలపాతం మీదుగా ఓ రెైల్వే బ్రిడ్జి ఉంది. రెైల్లో ప్రయాణిస్తూ... బ్రిడ్జి పెై నుండి దూద్సాగర్ అందాలను వీక్షిస్తే... కలిగే అనుభూతి అంతాఇంతా కాదు. దూద్సాగర్ చేరుకోవాలంటే.. ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులెమ్ రెైల్వే స్టేషన్ నుండి వెళ్లాలి. ఇక్కడికి బస్సుమార్గం కూడా ఉంది. లోండా, మడ్గాఁవ్ రెైల్వేమార్గంలో ఉంది కులెమ్ రెైల్వే స్టేషన్. ఇక్కడికి దగ్గరలోని మిరాజ్ జంక్షన్లో దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే అన్ని ప్రధాన ఎక్స్ప్రెస్ రెైళ్ళు ఆగుతాయి. అంతేకాకుండా... వాటర్ఫాల్స్ దగ్గర్లో కూడా ఓ చిన్న రెైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ కొన్ని ప్యాసింజర్ రెైళ్ళు అతితక్కువ సమయం పాటు (రెండు నిమిషాలు మాత్రమే) ఆగుతాయి.