ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

YOGA IS THE BEST FOR CURING DISEASES


మలబద్ధకాన్ని తగ్గించే... తిర్యక్‌ కటి చక్రాసనం



ఒబేసిటీిని, మలబద్ధకాన్ని తగ్గించడానికి ఈ తిర్యక్‌ కటి చక్రాసనం బాగా తోడ్పడుతుంది.
చేసే విధానం : మొదట తాడాసనంలో నిలబడి గాలిని తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులనూ పూర్తిగా పైకి లేపాలి. తర్వాత రెండు చేతుల వేళ్లను కలిపి ఉంచాలి. శరీరాన్ని పై నుంచి నముడు వరకు కుడివైపునకు తిప్పాలి. గాలిని వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని నడుము వరకు 90 శాతం ముందుకు వంచాలి. రెండు చెవులకు రెండు భుజాలు తగిలిస్తూ ఉండాలి. ఈ స్థితిలో కొంత సమయం ఉండాలి. తర్వాత నెమ్మదిగా గాలి తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. తర్వాత గాలిని వదులుతూ చేతులను కిందికి దించాలి. తర్వాత తాడాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇలాగే ఎడమ వైపూ చేయాలి.
ప్రయోజనాలు :
ఒబేసిటీని తగ్గించే యోగాసనాలలో తిర్యక్‌ కటిచక్రాసనం ఒకటి. నడుము దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది. నడుము నొప్పిని ఈ ఆసనం చెయ్యడం ద్వారా తగ్గించుకోవచ్చు. మలబద్ధకం, గ్యాస్‌ ట్రబుల్‌, లివర్‌, కిడ్నీలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. భుజం, నడుముకు సంబంధించిన కండరాలు బలపడతాయి. స్త్రీలలో యుటరస్‌, ఓవరీస్‌కు సంబంధించిన సమస్యలు, పురుషులలో ప్రోస్టేట్‌ గ్రంధికి సంబంధించిన సమస్యలను తొలగించుకోవచ్చు. 

SPECIALLY TELUGU RECIPE PRAWNS PICKLE


రొయ్యల పచ్చడి



కావలసిన పదార్థాలు
రొయ్యలు - అరకిలో
వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి)
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాల పొడి - అర చెంచా
నూనె - అరకిలో
నిమ్మకాయ - ఒకటి

తయారు చేసే విధానం
రొయ్యలు వాసన పోవాలంటే ముందుగా రెండు నిమిషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి వడగట్టి బట్టమీద వేసి ఆరనివ్వాలి. మూకుడులో నూనెపోసి కాగిన తరువాత రొయ్యలను వేయించాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడతాయి. వేగిన రొయ్యలను గిన్నెలోకి తీసుకోవాలి. రొయ్యలపచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అన్ని పచ్చళ్ళ మాదిరిగానే ఒక కప్పు నూనెలో కారం, ఉప్పు, మసాలాపొడి, రొయ్యలు కలిపి, నిమ్మకాయ పిండితే పచ్చడి రెడీ అయినట్టే. నీసులేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులకు ఇలాంటి పచ్చడి ఇంట్లో ఉంటే జిహ్వచాపల్యం తీరుతుంది.

NON VEG PICKLES - CHICKEN PICKLE


చికెన్‌ పచ్చడి



కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ చికెన్‌ - అరకిలో
వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి)
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాలు - 2
యాలకులు: - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి)
నూనె - అరకిలో
నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
చికెన్‌ ముక్కలు కడిగి ఒక బట్టమీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె పోసి చికెన్‌ ముక్కలు వేయించాలి. చికెన్‌ ముక్క నూనెలో ఉడికిందీ లేనిదీ చూసుకొని (మరీ గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి. ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి. ఇది బాటిల్‌లోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. 

IS OUR KITCHEN CLEAN ? TIPS FOR CLEAN KITCHEN


వంటిల్లు వుందా శుభ్రంగా!



ఇంటికి సంబంధించి కిచెన్‌ చాలా ముఖ్యమైనది. కుటుంబానికి కావలసిన ఆహారం తయారయ్యేది ఇక్కడే. తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఈ కిచెన్‌ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండకపోతే కిచెన్‌ పుణ్యమా అని అనారోగ్యం దరిచేరవచ్చు. తిరిగి ఆరోగ్యవంతులం కావడానికి ఎంతో కాలం, ధనం వెచ్చించాల్సి వస్తుంది.
కిచెన్‌ శుభ్రంగాలేకపోతే అనారోగ్యం వస్తుంది. అందుకు మూడు కారణాలున్నాయి. సరైన పారిశుధ్య పరిస్థితులు లేకపోవడం, ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణం కాకపోవడం, సరిగా వండకపోవడం. ఈ మూడు కారణాలు ప్రధానమైనవి. కిచెన్‌ క్షేమదాయకంగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. కిచెన్‌లో మంటలు చెలరేగడానికి ఒక కారణం వంట నూనె. దీనికి త్వరగా మండే స్వభావం ఉంటుంది. మూకుడు నిండా నూనె పోయడం లేదా బాగా కాగిన నూనెలో తడి కూరముక్కలు వేయడం/ నీళ్ల చిందులు పడడం. వీటి వల్ల మూకుడులోని నూనె బయటకు విరజిమ్మి ఒంటిమీద పడి గాయాలవుతాయి. అందుకే మూకుడులో నూనె సగం లేదా మూడోవంతు వరకు మాత్రమే పోయాలి. స్టవ్‌ మీద కాగుతున్న నూనెను వదిలి మరొక పనిలోకి వెళ్లకూడదు. అత్యవసరంగా మరొక పని చేయాల్సివస్తే మూకుడును నూనెతో పాటు స్టవ్‌మీద నుండి కింద పెట్టాలి.
సమస్యలు!
స్టవ్‌ మీద ఉంచిన పాత్ర హ్యాండిల్స్‌ మీ వైపుకు ఉండకూడదు. పొరపాటునో, హడావుడిలోనో మీ చెయ్యి దానికి తగిలిందంటే అది కిందనో/ మీదపడో అనవసర ప్రమాదాలు జరుగుతాయి. హ్యాండిల్‌కి మంట లేదా ఇతర పాత్రల వేడి తగిలేవిధంగా ఉంచకూడదు. అలా వుంచితే పాత్రను దింపేందుకు హ్యాండిల్‌ పట్టుకోగానే చుర్రుమంటుంది. కిచెన్‌లో వంటకు ఉపయోగపడే అనేక పదార్థాలు డబ్బాలలో నిల్వ చేసుకుని ఎత్తుగా షెల్ఫ్‌లో ఉంచుతారు. వీటిని తీసుకునేందుకు నేలమీద పీట వేసుకుని అందుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ పీట తగినంత గట్టిగా, స్థిరమైన కాళ్లు కలిగి ఉండాలి. ఏదో ఒక పీట వేసుకున్నారంటే దానిమీద నుండి పడడం, ఆపైన కొత్త ప్రమాదాలు ఎదురవుతాయి. బరువైన వస్తువులను బ్యాలన్స్డ్‌గా కిందికి దింపగలమనే అతి ఆత్మవిశ్వాసం మంచిది కాదు. ఇతరుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. కిచెన్‌లోని షెల్ఫుల్లో సామాన్లు ఎంతో ఆలోచనతోను, ప్రణాళికతో జాగ్రత్తగా సర్దుకోవాలి. నిల్వ ఉంచడం, నిరపాయకరంగా ఉండడం అనే విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. కిచెన్‌లో బిగించుకునే షెల్ఫులు దృఢమైన ఆధారాలకు బిగించుకోవాలి. పని అయిన తర్వాత షెల్ఫు తలుపులు మూసే అలవాటు లేకపోతే ఆ తలుపులే మీకు తగిలి గాయపరుస్తాయి. అందువల్ల అటూ ఇటూ జరిగే తలుపులున్న షెల్ఫులను అమర్చుకోవాలి.
విడివిడిగా ఉంచాలి!
కిచెన్‌ తగినంత విశాలంగా ఉండకపోవచ్చు. పాత్రలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే క్లీనింగ్‌ పౌడర్లు, సింకులు శుభ్రం చేసేందుకు వాడే యాసిడ్లు, లోషన్లు ఉండే చోటు పక్కనే వండుకున్న ఆహార పదార్థాలు ఉంచితే, అవి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మొనదేలిన వస్తువులు, కత్తిపీట, చాకు వంటివి పని పూర్తికాగానే ఎత్తైన ప్రదేశాల్లో ఉంచాలి. లేకపోతే వీటివల్ల ఇంట్లోవారికి కూడా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా డబ్బా మూత తెరవాలంటే తగిన పరికరం ఉపయోగించాలి గాని వేళ్లు కాదు. సీలు డబ్బాలకుండే రేకులను విడగొట్టేటప్పుడు కొంత తెగింది కదాని మిగిలిన దాన్ని చేత్తో పట్టుకుని లాగే ప్రయత్నం చేయకూడదు. పూర్తిగా తెగేవరకు పరికరాలను ఉపయోగించాలి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సూదిగా, వాడిగా ఉండే వస్తువులను శుభ్రపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చేతులు కోసుకుపోతాయి.


జాగ్రత్తలు!
పది పనులు ఒకేసారి చేయకూడదు. టేబుల్‌ చివర వేడి వంటకాలు పెట్టకూడదు. హడావుడిగా తిరిగేటప్పుడు ఆ పాత్రలకు తగిలి, అందులోనివి ఒలికి, ఒళ్లు కాలొచ్చు.
ఎలక్ట్రిక్‌ పరికరాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్వాలేదనే ఆలోచనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జీవితానికే ముప్పు. గ్రైండర్‌లో పప్పు రుబ్బుతూ కరెంటు ఆపేయకుండా అందులో చెయ్యి పెట్టడం, లోహపు గరిటెలు ఉంచడం, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ ఆన్‌లో ఉండగా అందులో నీళ్లు పోయడం వంటి పనులు చేయకూడదు.
ఎలక్ట్రిక్‌ పరికరాలతో పనిచేసేటప్పుడు కరెంటు సరఫరా నిలిపివేసి అవసరమైతే ప్లగ్‌ బయటకు తీస,ి వాటిలోని పదార్థాలను పట్టుకోవచ్చు.
ఆహారపదార్థాలను తగిన విధంగా నిల్వ చేసుకోకపోతే సూక్ష్మజీవుల వల్ల పాడైపోతాయి. అటువంటి ఆహారం తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్లే.
ప్రతి ఇంట్లోనూ కొన్ని నియమాలు పాటించడం మంచిది. ఆహార పదార్థాలు వేడిగా ఉంచాలి. చల్లని పదార్థాలను చల్లగా ఉంచాలి. తినే పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలి.
వంట చేసేముందు చేతులు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. దీనివల్ల సూక్ష్మజీవుల వ్యాప్తిని అరికట్టవచ్చు. మార్కెట్లో కొనుగోలు చేసిన కాయగూరలు, ఇతర పచ్చికూరలను నీటితో శుభ్రంగా కడగాలి. మిగిలిన ఆహార పదార్థాలను సింకు దగ్గర నిల్వ ఉంచకూడదు. తడిగా ఉండే ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు త్వరత్వరగా వ్యాప్తి చెందుతాయి.
వంటపని పూర్తికాగానే స్టవ్‌ మంటకు సంబంధించిన వ్యవస్థలన్నిటిని ఆపేయాలి. స్టవ్‌ 'నాబ్స్‌' పిల్లలకు అందే ఎత్తులో ఉంచకూడదు. వయసు చాలని పిల్లలు తెలియక ఈ నాబ్స్‌ తిప్పితే ప్రమాదాలు ఎదురవుతాయి.

B.P. DOWN DOWN - DOWN DOWN B.P WITH BEET ROOT JUICE


రక్తపోటును తగ్గించే బీట్‌రూట్‌ రసం




రక్తసోటును సులభంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు బీట్‌రూట్‌ రసం తాగాలని చెబుతున్నారు పరిశోధకులు. బీట్‌రూట్‌ రసం తాగిన కొద్ది గంటల్లోనే రక్తపోటు 4 నుండి 5 పాయింట్లు తగ్గిందని ఆస్ట్రేలియాకు చెందిన 'బేకర్‌ ఐడిఐ హార్ట్‌ అండ్‌ డయాబెటీస్‌ ఇన్‌స్టిట్యూట్‌' పరిశోధకులు కనుగొన్నారు. ' చాలా కాలం పాటు రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్‌ రసం తాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి' అని డాక్టర్‌ లె కొల్స్‌ చెప్పారు. 15 మంది పురుషులు, 15 మంది మహిళలపై అధ్యయనం చేశారు. బీట్‌రూట్‌ రసం తాగిన ఆరు గంటల తర్వాత వీరిద్దరిలో రక్తపోటు స్థాయి తగ్గింది. పురుషుల్లో రక్తపోటు గణనీయంగా తగ్గింది. బీట్‌రూట్‌లో ఆరోగ్యకరమైన పదార్థాలుంటాయి. ఇందులో విటమిన్‌-సి, విటమిన్‌-కె, పీచు, పాలిఫినొల్స్‌ ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే నైట్రేట్‌ రక్తపోటు తగ్గించడంలో బాధ్యత వహిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

SUNDAY SPECIAL CHICKEN DHUM BIRYANI RECIPE


చికెన్‌ దమ్‌ బిర్యానీ


కావలసిన పదార్థాలు


చికెన్‌ ముక్కలు - కిలో, పాలు - ఒకటింబావు లీటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర - 1 కట్ట, పచ్చిమిర్చి - 4, లవంగాలు - 3, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, వెన్న - 200 గ్రాములు, బాస్మతి బియ్యం - అరకిలో, మంచినీళ్లు - 6 కప్పులు, నిమ్మకాయలు - 2
తయారీ విధానం
వెడల్పాటి పాన్‌లో పాలు పొయ్యాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు కలపాలి. ఈ పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇందులోనే చికెన్‌ ముక్కలు కూడా వేసి ఉడికించాలి. బియ్యంలో నీళ్లుపోసి అన్నం మూడొంతులు ఉడికించాలి (అంటే అన్నం బాగా పలుకుగా ఉండాలి). మరో మందపాటి గిన్నెలో అడుగున ఒక స్పూన్‌ నూనె వేసి పలుకుగా ఉడికిన అన్నం పొరలాగా వేయాలి. దానిమీద పాలల్లో ఉడికించిన చికెన్‌, మళ్లీ దానిమీద అన్నం, ఆపై చికెన్‌... ఇలా పొరలుగా వేసి పైన నిమ్మరసం పోసి ఆవిరి పోకుండా మూత పెట్టాలి. మంట బాగా సిమ్‌లో పెట్టి దీన్ని పావుగంట ఉడికించాలి. రుచికరమైన చికెన్‌ బిర్యానీ రెడీ. 

RARE PHOTOS AND PICS - WHERE THE WORLD IS MOVING ?