ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

SRI POTHULURI VEERABRAHMENDRASWAMY KALAGNANAM PART-3


పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాల జ్ఞానం - 3

వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా వుండటం వల్ల, వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించటం అంత సులభం కాదు.

ఉదాహరణకు - బ్రహ్మంగారు చెప్పినది - ''ఆకాశమున రెండు బంగారు హంసలు వచ్చి పురములందు, వనములందు, నదులయందు సంచరించెను. ప్రజలు వానిని పట్టుటకు పోయి కన్నులు గానక గిర గిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చేరు...'' వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు. పేర్లు, వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణు బాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరయినా మరణించటం ఖాయం.

అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుంచి భూమిమీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూ కక్ష్యలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగినా పెను విద్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలు అని అన్వయించుకునే అవకాశం వుంది.

అణుబాంబులు, ఉల్కలు కాకుండా యు.ఐ.ఓ.లు (అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్) కావచ్చు. ఇవి భవిష్యత్ లో భూమిమీదకు వస్తాయా? వీటివల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకటం చాలా కష్టం.

వీరబ్రహ్మేంద్రస్వామి ''మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని'' చెప్పిన విధంగానే, ప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రడామస్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు.

నోస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీ.శ. 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీవంశంలో హత్యలు జరుగుతాయని, నోస్ట్రడామస్ తన 'క్వార్టైన్స్' లో చెప్పాడు. ఇవి ఫ్రెంచ్ భాషలో వుంటాయి.

''అయిదు నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో వున్న ఒక సాధూజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని'' నోస్ట్రడామస్ వివరించాడు. బహుశా ఈయనే మన్మోహన్ సింగ్ అనుకోవచ్చు! ఈయన అధికారంలో వున్నప్పుడు సైనికపరంగా భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోశ్యంలో వుంది. అది ఒకరకంగా నిజమే కదా! అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్ధిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతం మనదేశం పురోగామలోనే ఉంది.

ఇక్కడ నోస్ట్రడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరం. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే వందల సంవత్సరాల ముందు జరగబోయే విషయాలను దర్శించి చెప్పారో అలాగే నోస్ట్రడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రడామస్ జీవితం చాలా ఆశ్చర్యకరంగా వుంటుంది. కాబట్టి అప్పట్లో వున్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం చెప్పాడనే ప్రశ్నకు జవాబు లేదు.

నోస్ట్రడామస్ 1503లో ఫ్రాన్స్ లో జన్మించారు. ఆయన తల్లితండ్రులు యూదులు, చిన్నప్పటి నుంచీ ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తర్వాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారు. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ ఛార్లెస్ - 9 కు రాజ వైద్యునిగా నియమితులయ్యారు. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు.

నోస్ట్రడామస్ జీవిత చివరిదశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566జూలై ఒకటవ తేదీన, నోస్ట్రడామస్ చివరి జోశ్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ 'మనం రేపు కలుసుకుందాం' అన్నాడు.

దానికి జవాబుగా నోస్ట్రడామస్ 'రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు' అని పలికాడు. ఆరోజు రాత్రే నోస్ట్రడామస్ మరణించారు.

నోస్ట్రడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా, విశేషణాలతో, వర్ణనలతో కూడి వుంటాయి. ఖచ్చితత్వం తక్కువ. సంవత్సరాలు, దేశాల పేర్లు ఎక్కువగా వుండవు. నాలుగు వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో వున్న వీటినే 'క్వార్ట్టైన్స్' అంటారు.

నోస్ట్రడామస్ చెప్పినది - '45డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి' ఇక్కడ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో వుంటుందో, మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు.

డామ 'కొత్తనగరం' అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా.