ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ANCIENT TELUGU PURANA KATHA - YAVANASVUNI KATHA


హనుమాద్గాదా తరంగిణి అనే హనుమద్ చరితామృతం -36 - యవనాశ్వుని కధ .

యవనాశ్వుని కధ

పూర్వం కాంభోజ అగరం లో యవనాశ్వుడు అనే బ్రాహ్మణుడు వుండే వాడు .జటా జుత దారి శివ పూజా దురంధరుడు .ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్లి చాలా కాలమ్ అక్కడ వున్నాడు .అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ ,పంచ గావ్యాలను నివేదన గా పెడుతూ ,తాను తిన కుండా ,ఇతరులకు ఇవ్వ కుండా ,దగ్గర లో వున్ననీరు లేని బావి లో పడ వేసే వాడు .తేనే ,పళ్ళు ,పాలు ,పెరుగు తింటూ చాలా కాలమ్ గది పాడు .దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి .వాటిని తాను తిన కుండా ఇంకోల్లకు ఇవ్వ కుండా అలా నుతి లో పారేస్తే మూర్చ రోగం వస్తుంది .అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధ పడుతున్నాడు .
కొన్ని రోజులకు విశ్వా మిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళ బోసుకొన్నాడు .ఆయన దయ తలచి ”సువర్చలా దేవి దివ్య మంత్రాన్ని ”ఉపదేశించి ,ఆంజనేయుని సప్త వింశతి నామాలను చదువుతూ ఉండమని చెప్పాడు .
”ఆంజనేయ మతి పాతలానం -కాంచ నాద్రి కమనీయ విగ్రహం
పారిజాత తారు మూల వాసినం -భావయామి పవ మాన నందనం
హనుమానాన్జనా ఓఓణూః వాయు పుత్రో మహా బలహ -కపీన్ద్రః పింగాలాక్ష సచ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతో వీరః -సీతా శోక వినాశకః -ఆకాశ హన్తా రామ సఖః -రామ కార్య దురంధరః
మహౌశాదిగిరేర్హారీ -వానర ప్రాణ దాయకః -వారీ శాతార కస్చైవ -మైనాక గిరి భంజనః
నిరంజనో జిత క్రోధః కదళీ వన సంవృతః -ఊర్ధ్వ రేతా మహా సత్వః -సర్వ మంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్టాతా -భాష్య క్రుజ్జగాతాం వరః -శివ ధ్యాన పరో నిత్యం శివ పూజా పరాయనః ”
అనే ౨౭ నామాలే సప్త వింశతి నామాలు .అవి హనుమంతుడు ,అంజనా సూనుడు ,వాయుపుత్రుడు ,మహా బలుడు ,కపీన్ద్రుడు ,పింగా లాక్షుడు ,లంకా ద్వీప భయంకరుడు ప్రభంజన సుతుడు ,వీరుడు ,సీతా శోక వినాశ కుడు ,అక్ష హంత ,రామ సఖుడు ,రామ కార్య దురంధరుడు ,మహౌషధి గిరి హారి ,వానర ప్రాణ దాయకుడు ,వారీశాతారకుడు ,మైనాక గిరి భంజనుడు ,నిరంజనుడు ,జిత క్రోధుడు ,కదళీ వన సంవ్రుతుడు ,ఊర్ధ్వ రేతస్కుడు ,మహా సత్వుడు ,సర్వ మంత్ర ప్రవర్తకుడు ,మహా లింగ ప్రతిష్టాత ,భాష్య కారుడు ,జగద్వారుడు ,నిత్య శివ ధ్యాన పరుడు శివ పూజా పరాయణుడు

విశ్వా మిత్రుడు ఉపదేశించిన సువర్చలా మంత్రాన్ని ,జపిస్తూ హనుమ నామాలను పారాయణ చేస్తూ కొంత కాలమ్ గడిపాడు .వాటి మహాత్మ్యం తో అతని మూర్చ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్య వంతుదయాడు యవనాశ్వుడు .చాలా కాలమ్ ఆరోగ్యం గా జీవించి ,హనుమంతుని నిత్యం పూజిస్తూ ,భార్యా పిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుజ్యాన్ని పొందాడు .కనుక హనుమ నామానికి అంతటి శక్తి మహాత్మ్యం వున్నాయి .అందరు కలిసి హనుమ నామ సంకీర్తన చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది .అయితె చిత్త శుద్ధి తో చేయాలి .హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు .సాయుజ్యాన్ని కల్గిస్తాడు అని ఈ కదా సారాంశం .