ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

GODAVARI PUSHKARALU 2015 SPECIAL ARTICLE - PUSHKARA MANTRAM TO BE PERFORMED WHILE PUSHKARA SNANAM


పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవల్సిన విషయం.

పరమ శివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది. ఆ కృచ్చ నాకు ఆకలి వేస్తోంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది. అడిగితే ఆయన అన్నారు.. పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టు కోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరకి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటకి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్య రాశి వస్తుంది. కాని పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా "
అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వచ్చారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి...
"పిప్పలాదాత్ సముత్పన్న
కృత్యే లోకభయంకరీ
మృత్తికాంతే వయాదత్తా
మహారార్ధం ప్రకల్పయా"
(పుష్కర స్నానం చేసేముందు గుప్పెడు మట్టి తీసుకుని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానమాచరించాలి).