ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

Showing posts with label Pasura Prabhatham. Show all posts
Showing posts with label Pasura Prabhatham. Show all posts

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-10




GODDESS GODHA DEVI TELUGU PASURALU 28-30

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-9




GODDESS GODHA DEVI TELUGU PASURALU 26-27

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-8




GODDESS GODHA DEVI TELUGU PASURALU 22-24

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-7




GODDESS GODHA DEVI TELUGU PASURALU 19-21

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-6




GODDESS GODHA DEVI TELUGU PASURALU 16-18

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-5




GODDESS GODHA DEVI TELUGU PASURALU 13-15

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-4




GODDESS GODHA DEVI TELUGU PASURALU 10-12

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-3




GODDESS GODHA DEVI TELUGU PASURALU 7-9

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-2




GODDESS GODHA DEVI TELUGU PASURALU 4-6

Thiruppavai Pasurams IN TELUGU - Goddess Goda Devi - Tiruppavai (Goda/Andal Gita Malika) - ART BY SRI BAPU - PART-1






GODDESS GODHA DEVI TELUGU PASURALU 1-3

THIRUPPAVAI 30TH DAY PASURAMU


తిరుప్పావై 30 వ పాశురము -ఫలశ్రుతి

ఆండాళ్ తిరువడి గలే శరణం :
గోదాదేవి గోపిక ఆ నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణ సమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీ రంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకు పంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీ రంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవిని తనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .

భోగము = పరమాత్మ అను భావము
అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది.

ఇలాఆండాళు వ్రతముచేసి ఆనాడు గోపికలు పొందిన ఫలమును తాను పొందగలిగినది. ఆ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.

గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.

పాశురము:
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.

ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును.

తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయణం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకరరాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.
ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనం కూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండుగ పైపైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.
1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చేతనైనంతవరకు చేస్తారు. బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.

"వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.

దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్షనం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది.

"శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే "తింగళ్ తిరుముగత్తు" ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు.

అని ఫలశ్రుతి పాడిరి.
ఆండాళ్ తిరువడి గళే శరణం, జై శ్రీమన్నారాయణ్ ,
సర్వేజనా సుఖినో భవంతు .
ఓం శాంతి శాంతి శాంతీః

THIRUPPAVAI 29TH DAY PASURAMU IN TELUGU


తిరుప్పావై (శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు ఉన్) 29వ పాశురము

మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు.

శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

ఈ రోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏం కోరి వచ్చిందో నీరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్దులమై వచ్చాం అని గతంలో రెండు సార్లు చెప్పారు, మేం ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేం రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. "శిత్తమ్ శిఱుకాలే" ఇంకా చీకటి తొలగని తెల తెల వారే సమయంలో "వంద్" మేం నీ దగ్గరికి వచ్చాం. మాలో ఆర్తి పెంచినది నీవే కదా, ఎంత కాలం నీవు చేసిన ఫలితమో ఇన్నాళ్ళకు మాకు ఈ జ్ఞానం కల్గింది. ఇది నీవు చేసిన కృపేకదా. "ఉన్నై చ్చేవిత్తు" అన్ని నీవు చేసినవాడివి, శభరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేం చేయాల్సి వస్తుంది. మేం నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానంతో ఒక్క సారి మేం నీవాడమని చెప్పగల్గుతే, ఇది రాగ ప్రయుక్తం. "ఉన్ పొత్తామరై యడియే పోట్రుం" నీ పద్మాలవంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాం.

"ఎం కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్దకం సేవాయ" ఈ లోకంలో అల్పమైన పురుషార్దం కోసం వాడి కున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ, మరియు వీల్ల వాల్ల చుట్టూ తిరుగుతారే జనం ఎంత ఆశ్చర్యం కదా. "నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతసా సేవ్యె సస్య పదస్య దాసరీ సురే నారాయణే తిష్టతి" సమస్త జీవులకు నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా, ఆయన ముల్లోకాలను నడిపేవాడు, చేతులు కట్టుకున్నా సరే ఒక్క సారి మనస్సులో నీవాడనని తెలిపినా ఆయన పరమ పదాన్ని ఇస్తాడు అని కులశేఖర ఆళ్వార్ చెప్పినట్లుగా, మేం నీ పాదాలను పాడటనికి వచ్చాం అని చెప్పారు.

ఆయన ఏం విననట్టుగా సుదీర్గమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్ళకేసి చూస్తున్నాడు. "పొరుళ్ కేళాయ్" మేం ఎందుకు స్తుతిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాటం చెబుతోంది గోదా. ఆండాళ్ తల్లికి పాటం చెప్పడం అలవాటు కదా. ఆయనకీ పాటం చెప్పగలదు. "పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు" మొదట పశువులని మేపి అవి తిన్నాకగాని మేం తినేవాళ్ళం కాదు. నీకు మా స్వరూపం తెలియదా. మరి నీవేమి చేస్తున్నావు! మాకు ఆహారం నీ సేవయే, అది మాకు లభించాకే, ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి, "నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు" నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరాలు అని అన్నారు ఇదిగో అని అక్కడ పెట్టాడు. "ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!" మేం ఎదో అడగాలని వాటిని అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

"ఎత్తెక్కుం" ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్తల యందు, "ఏరేర్ పిఱవిక్కుం" ఏడేడు జన్మలలో కూడా "ఉన్ తన్నో డుత్తోమేయావోం" నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదంలో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి "ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్" కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరిదిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.

ఇలా వ్రతం ఆచరించిన అందరికి ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది, దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక "భోగి" అంటారు.

THIRUPPAVAI 28TH DAY PASURAMU


తిరుప్పావై - 28 

కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్

అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై

ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్

కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో

డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు

అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై

చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే

ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురములలో 28వ పాశురాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఈ దివ్యమైన పాశురములలో గోపికా తత్త్వంతో పూర్తి తన్మయం చెందిపోయి అమ్మ కృష్ణ పరమాత్మని ప్రార్ధిస్తున్నటువంటి దివ్యమైనటువంటి కీర్తన ఇది. ఇందులో గోపికా తత్త్వం చెప్పబడుతున్నది. ముఖ్యంగా భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు ఉండవలసినది నిష్కపటత్వము, నిరహంకారము. ఈ రెండూ చాలా ప్రధానం. ఆ రెండిటితో మనయొక్క తెలియనితనాన్ని తెలుసుకుంటే చాలు. అన్నీ తెలుసు అని సాధన చేస్తే ఏమీ లాభం లేదు. మాకేమీ తెలియదు స్వామీ నీ కృపయే దిక్కు అనేటటువంటి శరణాగతి కావాలి. పరతంత్రత - పరమాత్మయందు మనం ఆశ్రయించాలి. పరాధీనులం కావాలి. పరమాత్మకి పరాధీనులం కావాలి. ఆయనకు మనం స్వాధీనం అయిపోవాలి. ఆ తత్త్వం ఇందులో కనపడుతున్నది.

స్వామీ! మేము కేవలం ఏమీ తెలియనటువంటి అజ్ఞానులం. ఏదో పొట్ట పోసుకోవడానికి ఆవులవెంటే వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళం. కఱవైగళ్ పిన్ శెన్ఱు - అంటే పశువుల వెంట వెళుతూ

కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్ - అడవులకు చేరుకొని అక్కడ; శేర్-నుంద్-ణ్బోమ్ - అలా చేరుతూ పొట్ట పోషించుకుంటున్నటువంటి వాళ్ళం. పైగా అఱివొన్ఱు మిల్లాద - ఏమీ లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళమయ్యా! అయితే మాకున్న పుణ్యమంతా ఒక్కటే. ఏమీ తెలియని అజ్ఞానమైనటువంటి మా గోపవంశంలో నువ్వు పుట్టావు. ఆ పుణ్యం మాకుంది. అమాయకులమైన మమ్మల్ని ఉద్ధరించడం కోసం మాతో సమానముగా ఉన్నట్లుగా గోకులంలో ఉద్భవించావు నువ్వు. నీతో మాకున్నటువంటి సంబంధం పోగొట్టుకోవాలన్నా పోగొట్టేది కాదు. ఇది ఇంక వీడని సంబంధం. కృష్ణుడెవడు అంటే మావాడు. ఈ మావాడు అనేటటువంటి సంబంధం ఉన్నదే ఇది తెగనిది. అలాగే మేము నీవారము. మేము భగవంతుని వారం. భగవంతుడు మనవాడు. ఈభావం చాలా గొప్పది. గోపికల ప్రేమ నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. పరమాత్మ తప్ప ఏమీ కోరని ప్రేమ. మేము అర్హులము కనుక అనుగ్రహించు అనని ప్రేమ. అలాంటి నిష్కపటమైన ప్రేమ గనుకనే స్వామీ వివేకానంద గోపికాభక్తిని కీర్తిస్తూ ఎంతో ఘనంగా పాశ్చాత్యుల చెవులలో మారుమ్రోగేలాగా పాంచజన్య శంఖారావం చేశాడు. గోపికలు పవిత్రమైనటువంటి వ్యక్తులు. గోపికా కృష్ణ ప్రేమ అత్యంత పవిత్రమైనది. అది అర్థం కావాలంటే first make yourselves pure అని చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకే పవిత్రమైన హృదయాలకు మాత్రమే అర్థం అవుతుంది ఆ గోపీతత్త్వం. ఆయన మొత్తం హిందూ ధర్మానికి, భారతీయ ధర్మానికీ, దేశభక్తికీ, దైవభక్తికీ సాకారమై ఉద్భవించినటువంటి మహాపురుషుడు. ఆయన అవతరించిన రోజు ఇది. పైగా ఇది నూట యాభైవ జన్మదినం. ఈ సంవత్సరమంతా కూడా వివేకానంద జయంతి సంవత్సరంగా ప్రకటించుకుంటున్నాం. భారతీయులందరూ కూడా ఆచార్యుని తలంచుకోవాలి. లేకపోతే కృతఘ్నతా దోషం వస్తుంది. ప్రతివాడూ కూడా వివేకానంద సాహిత్యాన్ని చదవాలి కంకణం కట్టుకొని ఈరోజు నుంచి ఆ దీక్షతో వివేకానంద సాహిత్యాన్ని చదువుకొని దానిలో ఉన్న తత్త్వాన్ని ఆకళింపు చేసుకుంటేనే భారతదేశం పూర్వ వైభవాన్ని పొందగలదు. ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు. అటువంటి వివేకానందుని స్మరిస్తూ ఈవిషయంలోకి మళ్ళీ ప్రవేశిద్దాం. గోవుల వెంబడి తిరిగి వెళుతున్నటువంటి అమాయకులం స్వామీ! పైగా మా పుణ్యం చేత నువ్వు ఇక్కడ అవతరించావు. అతీతమైన వాడిని మేము చిన్న చిన్న నామాలతో, చిన్న చిన్న వాక్యాలతో కీర్తిస్తున్నామే! ఇది పొరపాటే. దీనిని క్షమించవయ్యా! అందని వాడిని అందుకోవడానికి మేము చెప్పే వాక్యాలు సరిపోతాయా? పరమాత్మ వాక్కులకు అందడు. చిన్న చిన్న పేర్లని పిలిచినందుకు కోపించకు, కృప చూపడం మానకయ్యా! మాకు ఆ పరమును ప్రసాదించు అని అడుగుతున్నారు. ఇక్కడ అన్నమాచార్య తన చివరి కీర్తనగా చెప్పబడుతున్నటువంటి దానిలో చెప్పినటువంటి భావం గుర్తుకు వస్తున్నది. "నా నాలుకపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి వేనామాల వెన్నుడా వినుతించ నెంత వాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివింతేనయ్యా, దాచుకో నీపాదాలకు తగనే చేసిన పూజలివే" అని చెప్పినట్లుగా స్వామీ ఈ చిన్న చిన్న పేర్లని ఇలా పిలిచినందుకు మమ్మల్ని మన్నించు. ఏమీ తెలియనటువంటి, లోక మర్యాదలు తెలియనటువంటి పిల్లలం మేము. పేరు పెట్టి నిన్ను పిలుస్తూన్నాం. కోపం తెచ్చుకోకయ్యా! అనుగ్రహించవయ్యా! "ఆలమందల వెన్క అడవులకేగి పరచుచూ కాచుచూ బ్రతికెదము మేము, ఏ తెలివియును లేని జాతి మాదయ్యా, వెంగలి విత్తులో వెర్రి గొల్లలము, అట్టి మాకులమున అవతరించితివి, ఆ పుణ్యమే చాలు అదే పదివేలు, కొదవయింతయు లేని గోవింద దేవా!" - గొప్ప మాట అన్నారు కొదవ లేని గోవిందుడా! ఈమాట చాలా విశేషం. ఏ లోపమూ లేని గోవిందుడా! ఏలోపమూ లేని అంటే పరిపూర్ణుడా! అని అర్థం. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్రలు లోపమనేది లేదు. కొందరికి కనపడింది అంటే వాళ్ళది శిశుపాల దృష్టి. వాళ్లకి లోపాలు కనపడతాయి అజ్ఞానం చేత. వాడి పేరు శిశిపాలుడు - శిశువు అంటేనే ఎదగని వాడు అని అర్థం. ఎదగనితనం అంటే అజ్ఞానం. అజ్ఞానానికి ప్రభువు వాడు. అందుకే శిశుపాలుడు అంటే. "నీతోడ మాకునూ, మాతోడ నీకు స్నేహ సంబంధంబు చెండాడ రాదు. వలదన్న నోటాడు బంధమ్ము కాదు" - నీతో మాకు ఉన్న బంధం వద్దంటే తెగేది కాదు. ఇది చాలా చక్కని మాట.

భగవంతునికీ మనకీ ఉన్న అనుబంధం ఉన్నదే అది తెగేది కాదు. అదే శాశ్వతం, అదే నిత్యం. మిగిలిన బంధాలన్నీ కూడా భ్రాంతులు మాత్రమే. ఇది నాది అని లోకంలో దేనితో పెట్టుకున్నా అది భ్రాంతే. పరమాత్మతో అనుబంధమే సత్యం. దానిని గుర్తించడమే భక్తి. గుర్తించి బ్రతకడమే గొప్ప జీవితం. ఆ గొప్ప జీవితమే గొప్ప సాధన. అదే తల్లి ఇందులో చూపిస్తూ ఉన్నది. భగవంతునితో ఉన్నటువంటి శాశ్వత సంబంధాన్ని గుర్తించాలి. అందుకే "మా అమృతాత్" అని చెప్తున్నది వేదమంత్రం. అమృత బంధం తెగరాదు. అమృతబంధం అంటే భగవంతుడితో ఉన్న బంధం అమృతబంధం. లోకంతో ఉన్న బంధం మృతబంధం. కనుక ఈ మృత బంధం తెగాలి. అమృత బంధం తెగరాదు. తెగదు. కొలతకందని స్వామిని చేతనైనట్లు ఆరాధించడమే కోలుచుకోవడం. ఇది చక్కటి మాట. అయితే మనం ఎంత కొలిచామో అంతే అనుకోరాదు. మనం ఎంత చేయగలిగామో అంత చేశామే తప్ప ఎంత చేయాలో అంత చేయలేదు. పరమాత్మ యొక్క వైభవాన్ని తత్త్వాన్ని తెలిసి పలుకగలమా! ఏదో తెలిసినంత పలుకుతూన్నాం. ఆ భావం భక్తిలో చాలా ప్రధానం. అంతేగానీ నేను కీర్తించాను, నేను చేశాను అని అహం పనికిరాదు. అటువంటి నిష్కపటమైన నిరహంకారమైనటువంటి సాధనని తల్లి ఇందులో బోధిస్తూ ఉన్నది. "వ్రతము ఫలింపంగ వాద్యమీవయ్యా, మా విన్నపములా మన్నింపుమయ్యా, మననోము జగతికి మంగళప్రదము."

ఆండాళ్ తిరువడిగలై శరణం!!

THIRUPPAVAI PASURAMU - 29TH DAY IN TELUGU


తిరుప్పావై - 29
శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నో
డుత్తోమేయావోం ఉనక్కే నాం అట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై చ్చేవిత్తు - శిత్తమ్ శిఱుకాలే - అంటే బాగా తెల్లవారకుండానే ఇంకా చీకటి ఉంటూ ఉండగానే తెల్లవారుఝామున; వంద్ - అనగా వచ్చి మిమ్మల్ని సేవించి నీయొక్క పాదాలని కీర్తించి మేము పాడుతూన్నాం.

పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ - లేత తామరల వంటి నీపాదాలను కీర్తిస్తూ మంగళ శాసనాలను చేస్తూన్నాం. ఇక్కడ చెప్పినప్పుడు బాగా తెల్లవారకుండానే రావడం అంటే అర్థం ఏమిటి? అనగా అంతర్ముఖమైనటువంటి ధ్యాన స్థితి అని మనం ముందే చెప్పుకున్నాం. అంతేకాదు భగవత్ సాధనకు కావలసినది ఏమిటి అంటే తపన. ఆ తపన ఏమిటి అంటే తెల్లవారకుండానే నిద్రలేచి వెళ్ళడం అనేది తీవ్రమైన శ్రద్ధను తెలియజేస్తుంది. అదే కావాలి అనే లక్ష్య శుద్ధిని, ఏకాగ్రతని తెలియజేస్తున్నది. స్వామియొక్క అందమైన పాదములు తలంచుకోగానే తల్లి చెప్తున్నది

పొత్తామరై యడియే - అన్నదిక్కడ. అంటే క్రొత్త తామరలవి. సుందరమైనటువంటి తామరపువ్వులను పోలినటువంటి నీ పాదాలకు మేమిప్పుడు మంగళాశాసనములు చేస్తున్నాం. చక్కటి మాటలు ఇక్కడ. భగవంతుణ్ణి కీర్తించిన దానికి ఫలితం ఏమిటి? అమ్మ కోరుకుంటున్నది ఏమిటి?

పోట్రుం పొరుళ్ కేళాయ్

పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు - ఓ స్వామీ! నువ్వు ఈ గోపవంశంలో అవతరించావు. ఎలాంటి గోపవంశం అంటే పశువుల్ని మేపుతూ పోషించుకుంటున్నటువంటి లేదా పశువుల్ని మేపుతూ బ్రతుకుతున్నటువంటి గోపవంశంలో అవతరించిన నీకు మేమిచ్చేటటువంటి కైంకర్యాలు తగదు అనరాదు అన్నారు. మేము మీ నుంచి కోరుకుంటున్నది

ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా! - నీనుంచి మేము పరం తీసుకోవడానికి వచ్చిన వారము కాదు. మొదటి నుంచీ ఏమున్నది? పరవాద్యమును ఇవ్వు అనేటటువంటిది శ్రీవ్రత ఫలంగా చెప్పినది. కానీ పరవాద్యం ఇమ్మని మాట వరుసకి అన్నానే కానీ కేవలం పరవాద్యం కాదు నాకు కావలసినది. మరేం కావాలి? ఇక్కడ పరవాద్యం అంటే మనం చెప్పుకున్నాం. మోక్షమని, పరమార్థమని. కానీ అంతకంటే గొప్పమాట ఒకటి చెప్తున్నది ఇక్కడ. భక్తులు మోక్షం కావాలి అని కూడా అనరు. మోక్షం కంటే గొప్పది అంటే ఏంటి అంటే "నమోక్షస్యాకాంక్షా" అన్నారు కదా మహానుభావులు కులశేఖరఆళ్వారులు. మోక్షాకాంక్ష కూడా భక్తులకి ఉండదు. వాడికి కావలసింది భగవంతునితో నిత్య సంబంధం. నిరంతరం మనస్సు ఆ మాధవుడితో తన్మయం చెందాలి. అది ఒక్కటి చాలు. అంతేకానీ నాకు జన్మరాహిత్యం కావాలి, జననమరణ పరంపర వద్దు అని కూడా భక్తుడు అడగడు. అందుకని ఆ పరమివ్వు అని కూడా నేను అనను. నాకు కావలసింది ఏంటి అంటే ఎప్పటికీ

ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నోడుత్తోమేయావోం - అనగా ఎప్పటికైనా ఎన్నెన్ని జన్మలకైనప్పటికీ కూడా నీతో విడదీయరాని బంధము కావాలి. ఇది చాలా చక్కటి కోరిక. అంటే జన్మలు వచ్చినా ఫరవాలేదు అనేటటువంటి ధైర్యం భక్తుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే శరీరం ఎలా ఉంటే ఏమున్నది? ఉపాధి ఎలా ఉంటే ఏమున్నది? మనస్సు నీపాదాలపై ఉన్నప్పుడు ఏ జన్మ వస్తే ఆ జన్మే కైవల్యము. కనుకనే శరీరం లేకపోవడమో, జన్మ లేకపోవడమో మోక్షం కాదు. మనస్సు పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే మోక్షం. అందుకు నీలో లయమై తన్మయమైనటువంటి స్థితి ఏ జన్మ వచ్చినా ఫరవాలేదయ్యా అదీ చెప్తున్నారు ఇక్కడ. పైగా

ఉనక్కే నాం అట్చెయ్ వోం - నిరంతరం నీకు కైంకర్యం చేసుకోవాలి. కైంకర్యము అంటే మనం చేసే ప్రతి పనీ భగవదర్పణంగా భగవత్ ప్రీతిగా చేయడమే కైంకర్యము. అది మాయొక్క అన్ని కోరికలను పోగొట్టుగాక! చిత్రం. కోరికలు తీర్చుగాక అనలేదు. కోరికలను పోగొట్టుగాక అన్నారిక్కడ. అందుకే భగవత్ కామం ఎటువంటిది అంటే భగవంతుణ్ణి కోరుకోవడం కోరిక కాదుట. ఎందుకంటే "స న కామయమనా నిరోధ రూపత్వాత్" అంటున్నారు నారదుల వారు. అది కోరిక కాదు. భక్తి కామిని కాదు. కోరుకొనేది కాదు. ఎందుకంటే అన్ని కోరికలూ ఎక్కడ ఆగిపోతాయో ఆ కోరిక భగవత్కామం. మోక్షమే అది. అందుకు అన్నీ భగవంతుడే. అదే సంబంధం. లోకంలో మనకి ఎన్నో సంబంధాలుంటాయి. తల్లి, తండ్రి, పుత్రులు, భార్య, స్నేహితులు ఇంకా శత్రువులు రకరకాల బందాలుంటాయి. కానీ తీయనైన ప్రగాఢమైన అనుబంధం భగవంతుడితోటే ఉండాలి. అందుకే "మాతా పితా భ్రాతా నివాస శరణం సుహృత్ గతిః నారాయణ ప్రభుః" అని శాస్త్రం చెప్తున్నది. సర్వమూ నారాయణుడే. ఇది శ్రీవ్రత ఫలంగా తల్లి చెప్పినటువంటి గొప్ప మాట.

THIRUPPAVAI 24TH DAY PASURAMU


 తిరుప్పావై (అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి)24వ పాశురము

ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని, తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని, తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి. ఈ పాశురము చాలా విశేషమైనది. స్వామివారికి హారతి చాలా ఇష్టం కదా ఈ పాసురములో స్వామికి హారతి ఎక్కువగా ఇస్తారు. విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.

* అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి పాశురము:

అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:

ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.

ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.

అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారుకదా, స్వామి వస్తుంటే ఆయనపాదాలను చూసారు అవి కందిపోయినట్లు అనిపించింది. పాదాలు స్వతాహా గులాభి రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపికి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. వీళ్ళేమి కోరి రాలేదు కదా. కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి అనందిద్దామని వచ్చారు. ఆయన సింహాసనంపై కూర్చొని, చిలిపి వాడు కదా, వీళ్ళను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు క్రింద పెట్టి “సవ్య పాదం ప్రసవ్య” ఎడమకాలు ప్రసరింపచేసాడు, “సృత దురితహరం దక్షిణం కుంచయిత్వా” దానిపై కుడి కాలు ఉంచి వీళ్ళకు తన పాదాలు కనిపించేలా అడిస్తూ కూర్చున్నాడు. ముఖారవిందం పదారవిందం అన్నీ అరవిందములవలే సుకుమారము, సౌగంద్యము, కోమలత్వము కల్గినవి కదా, ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ భాదపడ్డారు. వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు.

ఈ రోజు పాశురాన్ని మంగళాశాసన పాశురం అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎట్లాంటివాడో, తనూ ఎట్లాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడు, భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతుని కున్న శక్తిని మరచి ఆయన కున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞానిని అని మరచి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. ఒకనాడు జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించే అతను, భక్తితో ఈనాడు తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం ఆలయాల్లో తలుపులు, తాళం అని ఇలా చేస్తుంటాం, జగత్ రక్షణ చేసే వాడికి మనం రక్షణ ఏంటి కనుక. అది ప్రేమచే చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎట్లా అయితే హరించుకు పోతుందో అట్లా దోషాలన్ని హరించుగాక అని మంగళం పాడుతాం.

గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్న గారు తెలిపారు. విష్ణుచిత్తులవారు మధురానగరం వెళ్ళి పాండ్య రాజ్యసభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకు వారిని ఏనుగుపై అంబారీ చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. వీళ్ళ కంటికి నీవు కనపడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు. పల్-ఆండు అనేక సంవత్సరాలు, పల్-ఆండు అనేక సంవత్సరాలు పలకోటి నూరు - ఇలా కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, శంఖానికి, చక్రానికి, పక్కన అమ్మకి అంటూ ఇలా మంగళం పాడారు. శ్రీరామాయణంలో కూడా రాముని పరాక్రమం తెలిసినవారుకూడా రామునికి ఎన్నోసార్లు మంగళం పాడారు. జగత్ కారణ తత్వం దేవకీ గర్భంలో ఉందని తెలిసి కూడా, ఆ చతుర్ హస్తాల్తో ఉన్న కృష్ణుడిని చూసి కంసునికి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకీ అంటుంది. ఇవి ప్రేమతో చేసేవి. మన ఆలయాల్లో హారతి ఇచ్చే సంప్రదాయం కూడా ఇలా వచ్చిందే. అయితే హారతిని కళ్ళకు హద్దుకోరాదు. హారతిని ఆర్పి పక్కన పెట్టి, ఎవరికైతే దృష్టిదోషం తీస్తామో వారికి కళ్ళు, పాదాలు కడిగి ఆచమనం చేయిస్తాం. నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం. ఈ జగత్తుకు పరమాత్మ వేరు కదా, ఆయన క్షేమంగా ఉంటే లోకం అంతా క్షేమం, ఇక ఆయనను కోరాల్సిన అవసరం ఏంటి కనుక.

ఆండాళ్ ఏనాడో ఆయన నడిచివచ్చినందు పాదాలు కందిపోయాయని మంగళం పాడుతుంది. వీళ్ళకు కాలంతో ప్రమేయం లేదు, ఎందుకంటే కాలం అనేది కూడా ఒక గాజుగోడ లాంటిదే. వీరి ముందేనా అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు. "అన్ఱివ్వులగమ్" ఆనాడు వామనుడై లోకాలను "అళందాయ్" కొలిచిన, ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయే! "అడి" ఆ పాదాలకు "పోత్తి" మంగళం.

"శెన్ఱ్" వెళ్ళి "అంగు" అక్కడ ఉన్న "త్తెన్-ఇలంగై" దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకానగరాన్ని పాలించే రావణాసురున్ని "శెత్తాయ్" సంహరించిన "తిఱల్" నీ భుజబలానికి "పోత్తి"మంగళం.

"పొన్ఱ"తారుమారు అయ్యేలా "చ్చకడం" శకటాసురున్ని "ఉదైత్తాయ్" తన్ని అంతమొందిచావు, ఏడు నెలల బాలుడవి, "పుగర్" నీ కీర్తికి "పోత్తి" మంగళం.

"కన్ఱు" దూడ రూపంలో ఉన్న వత్సాసురున్ని "కుణిలా" కర్రలా మార్చి వెలగ పండులో దాగిఉన్న కపితాసురునిపై "వెఱిందాయ్" గిరగిరా తిరిగి విసిరిపాడేసి "కరిల్" నీ పాదానికి "పోత్తి" మంగళం.

"కున్ఱు" పర్వతాన్ని "కుడైయా" గొడుగులా "వెడుత్తాయ్" ఎత్తి పట్టి అందరిని దరిన చేర్చుకున్న నీ "కుణమ్" సౌశీల్య గుణానికి "పోత్తి" మంగళం.

ఆండాళ్ స్వామిచేసిన ఇన్ని కార్యాలను కీర్తించిందికదా, ఎక్కడైనా దృష్టిదోషం తగులుతుందేమోనని, ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా "వెన్ఱు" గెలిచి "పకై కెడుక్కుమ్" విరోదభావం లేకుండా చేసే "నిన్ కైయిల్" నీ హస్తంలో ఉన్న "వేల్" శూలాయుధానికి, తండ్రి నందగోపుడి వద్ద ఉన్న ఆయుధం "కూర్వేల్" ఇదేకదా, ఆ శూలానికి "పోత్తి" మంగళం.

"ఎన్ఱెన్ఱ్" ఎల్లప్పుడు "ఉమ్ శేవకమే" నీ చరితమునే "యేత్తి" కీర్తించేలా "ప్పఱై" ఆ వాయిద్యాన్ని "కొళ్వాన్" తీసుకుంటాం. "ఇన్ఱు" ఈ రోజు "యాం" మేం ఎందుకు "వందోం" వచ్చామో "ఇరంగ్" తెలుసుకొని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని అడుగుతున్నారు.

నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈ రోజు దృష్టి దోషం తొలగటానికి మంగళం పాడుతున్నారు. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది .ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లో కావచ్చు, మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది, ఇది మన ఆండాళ్ మనకు తెలుపుతుంది.

THIRUPPAVAI - 22ND PASURAMU IN TELUGU


తిరుప్పావై (అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన) 22వ పాసురము

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు 

* అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన పాసురము:

అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే

శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:

సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.

సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవవల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచిపోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు.

ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచింది. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. "ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్" ఏక ఛత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.

మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతికితే వాడికి గతి ఉండనే ఉండదు.

"అంగణ్ మా ఞాలత్తరశర్” ఈ అందమైన భూమి మీద అబిమాన పంగమాయ్ వందు” అభిమానాలను వదులుకొని వచ్చి “నిన్ పళ్ళికట్టిల్ కీరే” నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలే మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాలపై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పదసన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మనలాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్ని లోకాలను వదులుకొని రావాలనంటే అది కష్టం, కాని తరించాలి అంటే ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.

“శంగమ్ ఇరుప్పార్ పోల్” అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లాఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. “వందు తలై ప్పెయ్-దోమ్” ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి, మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేషాన్ని తగ్గించి నీ పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం.

ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, “కింగిణివాయ్ చ్చేయ్ద” చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని “తామరై ప్పూప్పోలే” పద్మాల్లా “శెంగణ్ శిఱుచ్చిఱిదే” అందముగా, మెల్లి మెల్లిగా “యెమ్మేల్” మాపై “విరయావో” ప్రసరించేట్టు చెయ్యి. “తింగళుమ్” చంద్రుడి చల్లటిచూపులాగా “ఆదిత్తియనుమ్” సూర్యుడి కాంతివలె “ఎరుందాఱ్పోల్” ఇద్దరూ కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేషించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి “ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం” అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.

తప్పు తప్పు “అంగణ్ ఇరండుం” ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, “కొండు ఎంగళ్మేల్” వాటిని మాపై పడేట్లు చెయ్యి. “నోక్కుదియేల్ ఎంగళ్మేల్” ఆచూపులు మాపై పడితే “శాపం ఇరింద్” మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్శతో పోయింది - మాకూ నీ పాద స్పర్శ కావాలి, చంద్రపుష్కరిణిలో స్నానం ఆడితే దక్షుడికి శాపం పోయింది - మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణిలో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది - మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. “చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన” నీ చూపు నాపై పడిందయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.