The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Telugu Dry Fruits Health Tips. Show all posts
Showing posts with label Telugu Dry Fruits Health Tips. Show all posts
HEALTH BENEFITS WITH JEEDI PAPPU
జీడిపప్పు
జీడిపప్పు లేని పాయసాన్ని ఊహించుకోవడమే చాలా మందికి కష్టం. కలవారింట కమ్మని వంటలలో చేరిపోయే జీడిపప్పు వంట రుచి చూడకపోతే సర్వం కోల్పోయినట్టుగా ఇంకొంతమంది ముఖాలు మాడ్చుకుంటారు. వంటలలో ఈ దినుసు పడిందంటే కాస్త కాస్ట్లీవారన్న అభిప్రాయానికి చేరువచేస్తుంది ఈ దినుసు. తెలుగు వారిచేత కాజు, జీడిపప్పుగా పిలుచుకునే క్యాషోనట్ అనకార్డియేసి కుటుంబానికి చెందినది. బహుశా మన గుండెకు, గుండె పై భాగానికి శక్తి తెచ్చే గుణాలు మెండుగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టి ఉంటారు.
గుండె బలానికి, కండ బలానికి మేలైనదిగా ఎంచుకుని ఇష్టంగా తినే జీడిపప్పు భారతదేశంలోనూ విరివిగానే పండుతోంది. కాని దీని నేటివ్ ప్లేస్ మాత్రం ఉత్తర దక్షిణ అమెరికాలుగా చెబుతున్నారు. పోర్చుగీసు వారు భారత దేశంలో అడుగుపెట్టి, వ్యాపారాలు చేసుకునే రోజుల్లో ఈ దినుసును మనకు పరిచయం చేశారని చరిత్ర చెబుతోంది. అయితే పచ్చివి కాకుండా వేయించిన జీడిపప్పును పరిచయం చేశారట. వారి ద్వారా ఈ మొక్క మన దేశంలో ముందుగా గోవాలో అడుగుపెట్టి, ఆ తర్వాత దక్షిణ తూర్పు ఆసియా, ఆఫ్రికాలోనూ వ్యాపించిందని చెబతుంటారు. ఆ తర్వాత ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడే జీడిచెట్లు వేళ్లూనుకుపోయాయి.
ఎత్తు తక్కువైనా తనలో విశాలత్వం ఎక్కువ అని చెప్పడానికేమో ఈ చెట్టు బహుసుందరంగా ఉంటుంది. ప్రతి పువ్వు లేత ఆకుపచ్చలో ఉండి, క్రమంగా ఎరుపు, పసుపు రంగులోకి మారుతుంది.
ప్రకృతిలో జీడిపండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో వస్తాయి. ఈ పండ్లను తింటే వగరుగా ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను తగ్గిస్తాయట. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార వల్ల కలిగే విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.
జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసే పరిశ్రమలు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరిలోని మోరి గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉపాధి పొంతున్నాయి. ఈ జీడిపప్పు ఎగుమతి ద్వారా భారత దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యమూ లభిస్తుంది.
జీడిపప్పు లేని పాయసాన్ని ఊహించుకోవడమే చాలా మందికి కష్టం. కలవారింట కమ్మని వంటలలో చేరిపోయే జీడిపప్పు వంట రుచి చూడకపోతే సర్వం కోల్పోయినట్టుగా ఇంకొంతమంది ముఖాలు మాడ్చుకుంటారు. వంటలలో ఈ దినుసు పడిందంటే కాస్త కాస్ట్లీవారన్న అభిప్రాయానికి చేరువచేస్తుంది ఈ దినుసు. తెలుగు వారిచేత కాజు, జీడిపప్పుగా పిలుచుకునే క్యాషోనట్ అనకార్డియేసి కుటుంబానికి చెందినది. బహుశా మన గుండెకు, గుండె పై భాగానికి శక్తి తెచ్చే గుణాలు మెండుగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టి ఉంటారు.
గుండె బలానికి, కండ బలానికి మేలైనదిగా ఎంచుకుని ఇష్టంగా తినే జీడిపప్పు భారతదేశంలోనూ విరివిగానే పండుతోంది. కాని దీని నేటివ్ ప్లేస్ మాత్రం ఉత్తర దక్షిణ అమెరికాలుగా చెబుతున్నారు. పోర్చుగీసు వారు భారత దేశంలో అడుగుపెట్టి, వ్యాపారాలు చేసుకునే రోజుల్లో ఈ దినుసును మనకు పరిచయం చేశారని చరిత్ర చెబుతోంది. అయితే పచ్చివి కాకుండా వేయించిన జీడిపప్పును పరిచయం చేశారట. వారి ద్వారా ఈ మొక్క మన దేశంలో ముందుగా గోవాలో అడుగుపెట్టి, ఆ తర్వాత దక్షిణ తూర్పు ఆసియా, ఆఫ్రికాలోనూ వ్యాపించిందని చెబతుంటారు. ఆ తర్వాత ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడే జీడిచెట్లు వేళ్లూనుకుపోయాయి.
ఎత్తు తక్కువైనా తనలో విశాలత్వం ఎక్కువ అని చెప్పడానికేమో ఈ చెట్టు బహుసుందరంగా ఉంటుంది. ప్రతి పువ్వు లేత ఆకుపచ్చలో ఉండి, క్రమంగా ఎరుపు, పసుపు రంగులోకి మారుతుంది.
ప్రకృతిలో జీడిపండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో వస్తాయి. ఈ పండ్లను తింటే వగరుగా ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను తగ్గిస్తాయట. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార వల్ల కలిగే విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.
జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసే పరిశ్రమలు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరిలోని మోరి గ్రామాలలో ఉన్నాయి. ఈ పరిశ్రమల మీద ఆధారపడి అనేక కుటుంబాలు ఉపాధి పొంతున్నాయి. ఈ జీడిపప్పు ఎగుమతి ద్వారా భారత దేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యమూ లభిస్తుంది.
EAT JEEDI PAPPU DAILY FOR ENERGETIC AND GOOD HEALTH
కాజూ తినండి రోజు..
మితాహారం ఆరోగ్యానికి అందమైన సూత్రం. జిహ్వ చాపల్యం పక్కన పెడితే.. ప్రకృతి ప్రసాదించిన ప్రతి పదార్థం ఆరోగ్య ప్రదాతే. జీడిపప్పు కూడా అదే కోవలోకి వస్తుంది. చాలా మంది అధిక కేలరీలు ఉండే కాజూ తింటే ఒళ్లు వచ్చేస్తుందని భయపెడుతుంటారు. కానీ, జీడిపప్పు చేసే మేలు గురించి చెబితే ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే.
మానవ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు కావాలి. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది.
మానవ శరీరానికి రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.
జీడిపప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాజు ద్వారా ఒంట్లోకి చేరిన పొటాషియం రక్తప్రసరణపై అనుకూలమైన ప్రభావం చూపుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. వీటిలో ఉండే సిలీనియమ్, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ ఆక్సిడేషన్కు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీడిపప్పులో లభించే జింక్.. ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది.
జీడిపప్పులో కాపర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయటంతోపాటు.. అనీమియా వ్యాధి రాకుండా ప్రివెన్షన్ మెడిసిన్గా
పని చేస్తుంది.
జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది. స్వీట్ల రూపంలో కూడా కాజూను తీసుకోవచ్చు. అయితే అది కూడా మితంగానే.
మితాహారం ఆరోగ్యానికి అందమైన సూత్రం. జిహ్వ చాపల్యం పక్కన పెడితే.. ప్రకృతి ప్రసాదించిన ప్రతి పదార్థం ఆరోగ్య ప్రదాతే. జీడిపప్పు కూడా అదే కోవలోకి వస్తుంది. చాలా మంది అధిక కేలరీలు ఉండే కాజూ తింటే ఒళ్లు వచ్చేస్తుందని భయపెడుతుంటారు. కానీ, జీడిపప్పు చేసే మేలు గురించి చెబితే ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే.
మానవ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు కావాలి. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది.
మానవ శరీరానికి రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.
జీడిపప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాజు ద్వారా ఒంట్లోకి చేరిన పొటాషియం రక్తప్రసరణపై అనుకూలమైన ప్రభావం చూపుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
క్యాన్సర్ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. వీటిలో ఉండే సిలీనియమ్, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ ఆక్సిడేషన్కు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీడిపప్పులో లభించే జింక్.. ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది.
జీడిపప్పులో కాపర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయటంతోపాటు.. అనీమియా వ్యాధి రాకుండా ప్రివెన్షన్ మెడిసిన్గా
పని చేస్తుంది.
జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది. స్వీట్ల రూపంలో కూడా కాజూను తీసుకోవచ్చు. అయితే అది కూడా మితంగానే.
EAT DRY FRUITS DAILY TO OVERCOME DENTAL, EYES PROBLEMS AND GIVES POWER TO BONES ETC
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినుటవలన యూరినల్లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కిస్మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.
" ఆరోగ్యకర ఉపయోగాలు "
1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .
2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది .
3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .
4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును .
5. జ్యరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది .
6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును .
7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .
8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .
9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .
కిస్మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్మిస్ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. పిల్లలు రాత్రిపూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రిపూట రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ర్తీల కు ఇది ఎంతో ఉపయోగం.
" ఆరోగ్యకర ఉపయోగాలు "
1.దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది .
2.కండ్ల కు మంచిది : ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది .
3.ఎముకులకు రక్షణ : కాల్సియం , బోరాన్ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .
4.సెక్షువల్ వీక్నెస్ : లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును .
5. జ్యరము : ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది .
6. రక్తహీనత : ఒక మోతాదులో ' ఐరన్ ' & బీకాంప్లెక్ష్ ,కాపర్ ... కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును .
7. ఎసిడోసిస్ : ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును .
8. శరీర బరువు : కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్ , గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది .
9. మలబద్దకం : ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .
Subscribe to:
Posts (Atom)