The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Lord Siva Bhakthi / Devotional Articles. Show all posts
Showing posts with label Lord Siva Bhakthi / Devotional Articles. Show all posts
Neelakantam Virupaksham Nirmalam - Lord Shiva images collection
"Neelakantam Virupaksham Nirmalam
Nilayapradtham Namami Sirasa Devam
Kimno Mrithyu Karishyathee"
Meaning:
What can death do to me when I salute Lord Shiva whose throat is blue, who has three eyes, who is pure and blesses stability
"Vamadevam Mahaadevam Lokanatham
Jagathgurum Namami Sirasadevamkimno
Mrityu Karishyathe"
Meaning:
What can death do to me when I bow to Lord Vamadeva (Shiva), who has three eyes and who is the universal preceptor and lord.
LORD SHIVA BHAKTHI PRAYERS COLLECTION
దారిద్ర్య విమోచన స్తోత్రం
ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.....!!!!
జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. క్షణంలో నిరుపేదను సైతం శ్రీమంతునిగా కరుణించగల సామర్థ్యం ఆ తల్లిది! ఆ తల్లి 108 నామాలైన "లక్ష్మీ అష్టోత్తర శత నామా" లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ఆ తల్లిని శ్రద్ధగా ధ్యానించి. ఆ తరువాత దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని పఠించాలి.
ధ్యానం:
వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి:
సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్
ఈ దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని నిత్యం పఠించేవారికి, అన్ని రకాలైన దారిద్ర్యలు తొలగి శుభం కలుగుతుంది.
* దారిద్ర్య విమోచన స్తోత్రం:
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం
ధన్యాం హరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్పాం విభావరీమ్
అదితం చ దితిం దీప్తాం వసధాం వసుధారిణీం
నమామి కమలాం కాంతాం కామాం క్షీరోద సంభవాం
అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీం
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం
పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభాం
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం
చతుర్బుజాం చంద్రరూపాం ఇందిరామిందు శీతలాం
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం
ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశస్వినీం
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణ్య సౌమ్యాం శుభప్రదాం
నృపవేశ్మగతా నందా వరలక్ష్మీ వసుప్రదాం
శుభాం హిరణ్యప్రాకారాం సముద్ర తనయాం జయాం
నమామి మంగళాం దేవీల విష్ణువక్ష: స్థల స్థితాం
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితం
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం
త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
మాతర్నమామి కమలే, కమాలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని, విశ్వమాత:
క్షీరోదజే, కమలకోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం సమతాం శరణ్యే.
ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.....!!!!
జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. క్షణంలో నిరుపేదను సైతం శ్రీమంతునిగా కరుణించగల సామర్థ్యం ఆ తల్లిది! ఆ తల్లి 108 నామాలైన "లక్ష్మీ అష్టోత్తర శత నామా" లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ఆ తల్లిని శ్రద్ధగా ధ్యానించి. ఆ తరువాత దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని పఠించాలి.
ధ్యానం:
వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి:
సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్
ఈ దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని నిత్యం పఠించేవారికి, అన్ని రకాలైన దారిద్ర్యలు తొలగి శుభం కలుగుతుంది.
* దారిద్ర్య విమోచన స్తోత్రం:
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రదాం
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం
వాచం పద్మాలయాం పద్మాంశుచిం స్వాహాం స్వధాం సుధాం
ధన్యాం హరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్పాం విభావరీమ్
అదితం చ దితిం దీప్తాం వసధాం వసుధారిణీం
నమామి కమలాం కాంతాం కామాం క్షీరోద సంభవాం
అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం
అశోకామమృతాం దీప్తాం లోకశోక వినాశినీం
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్ష్మీం పద్మ సుందరీం
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం
పుణ్యగంధాం సుప్రసన్నం ప్రసాదాభిముఖీం ప్రభాం
నమామి చంద్ర వదనాం చంద్రాం చంద్ర సహోదరీం
చతుర్బుజాం చంద్రరూపాం ఇందిరామిందు శీతలాం
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీం
విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్య నాశినీం
ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం
భాస్కరీం బిల్వనిలయాం వరారోహం యశస్వినీం
వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం
ధనధాన్యకరీం సిద్ధిం స్రైణ్య సౌమ్యాం శుభప్రదాం
నృపవేశ్మగతా నందా వరలక్ష్మీ వసుప్రదాం
శుభాం హిరణ్యప్రాకారాం సముద్ర తనయాం జయాం
నమామి మంగళాం దేవీల విష్ణువక్ష: స్థల స్థితాం
విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితం
దారిద్ర్య ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం
నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణు శివాత్మికాం
త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధి విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరిసిజాం వందే ముకుంద ప్రియాం
మాతర్నమామి కమలే, కమాలాయతాక్షి
శ్రీ విష్ణు హృత్కమలవాసిని, విశ్వమాత:
క్షీరోదజే, కమలకోమల గర్భగౌరి
లక్ష్మి ప్రసీద సతతం సమతాం శరణ్యే.
DWADASA JYOTHIRLINGAMULU - PUJA PARTICULARS
ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం!
"సప్త జన్మల పాపం నశించి సన్మార్గ వర్తనలు కావడని కీస్తోత్రం అత్యంత ఫలప్రదాయమైనదనీ - కేవలం స్మరణ మాత్రాన సంకల్ప సిద్ది కలుగుతుందనీ వివరించారు మన పూర్వీకులు.
" ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !
శ్రీ శైలే మల్లికార్జునం !!
ఉజ్జయిన్యాం మహాకాళం !
ఓంకారే పరమేశ్వరం !!
కేదారం హిమవతః పృష్ఠేః !
ఢాకిన్యాం భీమశంకరం !!
వారణాస్యాం తు విశ్వేశం !
త్ర్యంబకం గౌతమీతటే !!
వైద్యనాధం చితాభూమౌ !
నాగేశం దారుకావనే !!
సేతుబంధే చ రామేశం !
ఘశ్మేశం చ శివాలయే !!"
మునులంతా అయనతో శృతి కలిపారు. అనంతరం
ఆయా స్థలాల విశేషాలు చెప్పమని శౌనకాది మునివరేణ్యులు కోరగా సూతుడు ఇలా చెప్పసాగాడు.
1. సౌరాష్ట్ర:
"ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రభాసక్షేత్రంలో ఉన్న సోమనాధ స్వామి. (సోమనాధ లింగం)
దక్ష ప్రజాపతి తన 27 గురు పుత్రికలను (అశ్వని, భరణి మొ|| 27 నక్షత్రాలు వీరే) చంద్రునకిచ్చి పెళ్లి చేశాడు. కాని చంద్రుడు ఒక్క రోహిణి యందు మాత్రం ఎక్కువ ప్రేమకలిగి, మిగతా వారిని సరిగ్గా చూడకపోగా వారంతా తమ తండ్రితో చెప్పుకున్నారు.
అది సహించని దక్షుడు, చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శపించాడు. బ్రహ్మదేవుని సూచనమేరకు, చంద్రుడు ఈ ప్రభాస తీర్థానగల శివలింగాన్ని అర్చించి రోగ విముక్తుడైనాడు. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.(ప్రస్తుతం ఇక్కడ వున్న సోమనాధ మందిరంలోని గర్భగుడి క్రింద ఉన్న గుహలో - ఆనాటి చంద్రార్చిత శివలింగాన్ని చూడగలం!)
2. శ్రీశైలం:
ఆంద్రదేశమందున్నదీ శ్రీశైల క్షేత్రం. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్న స్వామివారు సాక్షిగణపతి సహితుడు కూడ!
క్రౌంచ పర్వతం వీడి అలిగి వెళ్లిపోయిన తమ కుమారుని షణ్ముఖుని వెతుకుతూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై వెలశాడు. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అని ఇక్కడ శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని శ్రుతి.
3. ఉజ్జయిని:
శిప్రా నదీ తీరంలోని (మాళవ) ఉజ్జయినీ నగరంలో మహా కాళేశ్వర లింగం మూడవది.
ఉజ్జయిని రాజు చంద్రసేనుడు శివార్చనపరుడై ఉండడం చూసి, శ్రీకరుడనే గోపబాలకుడు ఆ విధానం శ్రద్ధగా పరికించి తానూ ఒకరాతిని తెచ్చి అట్లే పూజించసాగాడు. ఇంట్లో వాళ్లు అతని పూజకు ఆటంకం కల్పిస్తున్న కొద్దీ అతడిలో భక్తి తత్పరత అధికం కాసాగింది. చివరకు స్వామి ఆ రాతిలోనే స్థిరపడ్డాడు.
సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.
4. అమలేశ్వరం:
మాళవ దేశంలోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, ఈ క్రమంలో నాలుగవది.
పర్వతాలన్నిటిలోకెల్లా తానే గొప్ప పర్వతాన్ననే అహంకారంతో వింధ్యపర్వతం విర్రవీగుతూండగా, అట్టి వింధ్యుడికి - అహంకారం అణచడానికి నారదుడు నడుం కట్టాడు.
పర్వతాల్లో కెల్లా మేరువే గొప్పవాడని - అతడికి దైవత్వం ఉందనీ నారదుడు చెప్పడంతో, తానూ దైవత్వం సాధించాలని వింధ్యుడు నర్మదా నదీ తీరాన అమలేశ్వరంలో పార్థివ లింగారాధన చేసి, పరమేశ్వరాను గ్రహానికి పాత్రుడయ్యాడు. దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపుడై పరమశివుడు ఓంకార మూర్తిగా వెలశాడు.
5. కేదారం:
హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు.
6. ఢాకిని:
సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా (త్రిపురాసుర సంహారము తర్వత) వెలసిన తావు ఢాకిని, ఇక్కడ విహారానికి వచ్చి, ఈ ప్రాంతపు నైర్మల్యానికి ముచ్చటపడి లింగరూపుడైనాడు.
సర్వసంకటహరుడుగా, భీమేశ్వర లింగానికున్న ఖ్యాతి అనంతం.
7. వారణాశి:
మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే (అవిముక్తం) ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ సాంబశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం.
ప్రళయకాలంలో కూడా - ఈ క్షేత్రాన్ని విశ్వేశ్వరుడు లయం నుండి మినహాయింపు ఇచ్చినట్లు ప్రతీతి.
స్వామి లింగరూపుడై ఇచ్చట వెలసి, సదా సుప్రసన్నంగా సర్వ సేవ్యంగా ఉంటాడు. అన్నఫూర్ణ - ఢుంఢి వినాయక బిందుమాధవ సహితుడైనట్టి ఈ ప్రదేశానికి 'కాశ్యాంతు మరణాన్ముక్తిః' అని ఇక్కడ మరణించేవారికి ముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం.
శ్రీహరి తపస్సు చేసిన విశేషస్థలి కూడ.
8. త్రయంబకం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసికవద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.
9. వైద్యనాదం:
రావణాసురుని అనుగ్రహించిన శివుడు, తానే స్వయంగా ప్రసాదించిన లింగం ఎక్కడా క్రిందపెట్టకుండా పూర్తిగా చేతులతో మాత్రమే తీసుకేళ్లాలని ఆంక్షపెట్టి మరీ ఇచ్చాడు. ఎక్కడ దానిని భూమిపై ఉంచితే అక్కడ ప్రతిష్ఠాపన అయిపోగలదన్నాడు.
తన లంకానగరిలో ప్రతిష్ఠించాలన్న తాపత్రయంతో దాన్ని పొందివున్నాడు రావణుడు.
వింధ్య పర్వతాల దగ్గర కొచ్చేసరికి, కారణాంతరాల వల్ల లింగాన్ని చేతుల్లోంచి దించవలసివచ్చి, సమీపంలోనే ఉన్న ఓ గొల్లపిల్ల వాడిని పిలిచి తాను వచ్చి తీసుకొనేదాకా ఆ లింగం చేతుల్లోనే ఉంచవలసిందని కోరాడు. ఈలోగా దేవతల ప్రేరణచే, ఆ గొల్లడు రావణుడు రాకుండానే దాన్ని నేలన పెట్టేశాడు.
ఇంకేమూందీ? అది అక్కడే ప్రతిష్ఠితం అయిపోయింది. పర్లి అనే ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ఠకు గొల్లని రూపంలో శ్రీకృష్ణుడే కారకుడని ఐతిహ్యం. ప్రత్యక్షంగా రోగనివారకుడై వైద్యనాధస్వామిగా అనుగ్రహిస్తున్నాడిక్కడ.
10. ద్వారక:
నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.
దారుకుడనే రాక్షసుడి బారినుండి సుప్రియుడు అనే మహాశివార్చనాపరుని రక్షించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక్కడ. ఈ లింగార్చన వల్ల చక్రవర్తిత్వం సిద్ధిస్తుందని నలచక్రవర్తి నిరూపించాడు.
11. రామేశ్వరం :
త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి, జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు.
12. దేవగిరి:
దక్షిణాదిన దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు".
..అని అయా జ్యోతిర్లింగాల విశేషాలను చెప్పిన సూతుడు, మరోసారి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి, స్తోత్రపఠన ఫలితాన్ని ఈ విధంగా ఎరింగించాడు -
శ్లో.
ద్వాద శైతాని నామాని - ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వ పాప వినిర్ముక్తం - సర్వసిద్ధిప్రదం లభేత్ ||
యం యం కామ మపేక్ష్యైవ - పఠిష్యంతి నరోత్తమాః
ప్రాష్యంతి కామం తం తం హే - పరత్రేహ మునీశ్వరాః ||
ఏతేషాం పూజనే నైవ - వర్ణానాం దుఃఖనాశనం
ఇహలోకే పరత్రాపి - ముక్తిర్భవతి నిశ్చితం ||
ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం!
ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం!
"సప్త జన్మల పాపం నశించి సన్మార్గ వర్తనలు కావడని కీస్తోత్రం అత్యంత ఫలప్రదాయమైనదనీ - కేవలం స్మరణ మాత్రాన సంకల్ప సిద్ది కలుగుతుందనీ వివరించారు మన పూర్వీకులు.
" ఓం సౌరాష్ట్రే సోమనాధం చ !
శ్రీ శైలే మల్లికార్జునం !!
ఉజ్జయిన్యాం మహాకాళం !
ఓంకారే పరమేశ్వరం !!
కేదారం హిమవతః పృష్ఠేః !
ఢాకిన్యాం భీమశంకరం !!
వారణాస్యాం తు విశ్వేశం !
త్ర్యంబకం గౌతమీతటే !!
వైద్యనాధం చితాభూమౌ !
నాగేశం దారుకావనే !!
సేతుబంధే చ రామేశం !
ఘశ్మేశం చ శివాలయే !!"
మునులంతా అయనతో శృతి కలిపారు. అనంతరం
ఆయా స్థలాల విశేషాలు చెప్పమని శౌనకాది మునివరేణ్యులు కోరగా సూతుడు ఇలా చెప్పసాగాడు.
1. సౌరాష్ట్ర:
"ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ప్రభాసక్షేత్రంలో ఉన్న సోమనాధ స్వామి. (సోమనాధ లింగం)
దక్ష ప్రజాపతి తన 27 గురు పుత్రికలను (అశ్వని, భరణి మొ|| 27 నక్షత్రాలు వీరే) చంద్రునకిచ్చి పెళ్లి చేశాడు. కాని చంద్రుడు ఒక్క రోహిణి యందు మాత్రం ఎక్కువ ప్రేమకలిగి, మిగతా వారిని సరిగ్గా చూడకపోగా వారంతా తమ తండ్రితో చెప్పుకున్నారు.
అది సహించని దక్షుడు, చంద్రుని క్షయ వ్యాధిగ్రస్తుడై పోవాలని శపించాడు. బ్రహ్మదేవుని సూచనమేరకు, చంద్రుడు ఈ ప్రభాస తీర్థానగల శివలింగాన్ని అర్చించి రోగ విముక్తుడైనాడు. సోముడు అనగా చంద్రుడు. లింగరూపుడై ఇక్కడ వెలసిన శివుని ఆరాధించాడు కనుక దీనికి సోమనాధ క్షేత్రం అని పేరు వచ్చింది.(ప్రస్తుతం ఇక్కడ వున్న సోమనాధ మందిరంలోని గర్భగుడి క్రింద ఉన్న గుహలో - ఆనాటి చంద్రార్చిత శివలింగాన్ని చూడగలం!)
2. శ్రీశైలం:
ఆంద్రదేశమందున్నదీ శ్రీశైల క్షేత్రం. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్న స్వామివారు సాక్షిగణపతి సహితుడు కూడ!
క్రౌంచ పర్వతం వీడి అలిగి వెళ్లిపోయిన తమ కుమారుని షణ్ముఖుని వెతుకుతూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడై వెలశాడు. 'శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే' అని ఇక్కడ శ్రీశైల శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ అనేది ఉండదని శ్రుతి.
3. ఉజ్జయిని:
శిప్రా నదీ తీరంలోని (మాళవ) ఉజ్జయినీ నగరంలో మహా కాళేశ్వర లింగం మూడవది.
ఉజ్జయిని రాజు చంద్రసేనుడు శివార్చనపరుడై ఉండడం చూసి, శ్రీకరుడనే గోపబాలకుడు ఆ విధానం శ్రద్ధగా పరికించి తానూ ఒకరాతిని తెచ్చి అట్లే పూజించసాగాడు. ఇంట్లో వాళ్లు అతని పూజకు ఆటంకం కల్పిస్తున్న కొద్దీ అతడిలో భక్తి తత్పరత అధికం కాసాగింది. చివరకు స్వామి ఆ రాతిలోనే స్థిరపడ్డాడు.
సంధ్యా సమయంలో ఈ కాళేశ్వర లింగాన్ని దర్శించడం విశేష ఫలప్రదం.
4. అమలేశ్వరం:
మాళవ దేశంలోని నర్మదాతీరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగం, ఈ క్రమంలో నాలుగవది.
పర్వతాలన్నిటిలోకెల్లా తానే గొప్ప పర్వతాన్ననే అహంకారంతో వింధ్యపర్వతం విర్రవీగుతూండగా, అట్టి వింధ్యుడికి - అహంకారం అణచడానికి నారదుడు నడుం కట్టాడు.
పర్వతాల్లో కెల్లా మేరువే గొప్పవాడని - అతడికి దైవత్వం ఉందనీ నారదుడు చెప్పడంతో, తానూ దైవత్వం సాధించాలని వింధ్యుడు నర్మదా నదీ తీరాన అమలేశ్వరంలో పార్థివ లింగారాధన చేసి, పరమేశ్వరాను గ్రహానికి పాత్రుడయ్యాడు. దేవతల కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపుడై పరమశివుడు ఓంకార మూర్తిగా వెలశాడు.
5. కేదారం:
హిమాలయ పర్వత శ్రేణులలో, ఒక కొండ కొనకొమ్ము ఆకృతిలో సదాశివుడు కేదారనాధుడిగా అవతరించడానికి నరనారాయణులనే మునివర్యులే కారకులు. వారి ఉగ్రతపోదీక్షకు మెచ్చిన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపుడైనాడు.
6. ఢాకిని:
సంపూర్ణ శివభక్తులైన సుదక్షిణ - కామరూపుల జంట సంరక్షణార్థం పార్వతీపతి జ్యోతిర్లింగ రూపుడై సహ్యాద్రి కనుమలలో భీమనదీ ఉత్తర దిశాతీరాన భీమశంకర జ్యోతిర్లింగంగా (త్రిపురాసుర సంహారము తర్వత) వెలసిన తావు ఢాకిని, ఇక్కడ విహారానికి వచ్చి, ఈ ప్రాంతపు నైర్మల్యానికి ముచ్చటపడి లింగరూపుడైనాడు.
సర్వసంకటహరుడుగా, భీమేశ్వర లింగానికున్న ఖ్యాతి అనంతం.
7. వారణాశి:
మహా క్షేత్ర తీర్థరాజమై, సర్వ విద్యాధామమై విరాజిల్లే (అవిముక్తం) ముక్తి క్షేత్రమైన వారణాశి లేదా కాశీ సాంబశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం.
ప్రళయకాలంలో కూడా - ఈ క్షేత్రాన్ని విశ్వేశ్వరుడు లయం నుండి మినహాయింపు ఇచ్చినట్లు ప్రతీతి.
స్వామి లింగరూపుడై ఇచ్చట వెలసి, సదా సుప్రసన్నంగా సర్వ సేవ్యంగా ఉంటాడు. అన్నఫూర్ణ - ఢుంఢి వినాయక బిందుమాధవ సహితుడైనట్టి ఈ ప్రదేశానికి 'కాశ్యాంతు మరణాన్ముక్తిః' అని ఇక్కడ మరణించేవారికి ముక్తి కలుగుతుందని శాస్త్ర వచనం.
శ్రీహరి తపస్సు చేసిన విశేషస్థలి కూడ.
8. త్రయంబకం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి తపస్సుకు అనుగ్రహించి, నాసికవద్ద తన జటాజూటం నుండి గోదావరి నదిని ప్రవహింపజేసి అనుగ్రహించిన పరమేశ్వరుడు ఈ నదీ తీరాన త్రయంబకేశ్వరుడనే జ్యోతిర్లింగంగా వెలిశాడు.
9. వైద్యనాదం:
రావణాసురుని అనుగ్రహించిన శివుడు, తానే స్వయంగా ప్రసాదించిన లింగం ఎక్కడా క్రిందపెట్టకుండా పూర్తిగా చేతులతో మాత్రమే తీసుకేళ్లాలని ఆంక్షపెట్టి మరీ ఇచ్చాడు. ఎక్కడ దానిని భూమిపై ఉంచితే అక్కడ ప్రతిష్ఠాపన అయిపోగలదన్నాడు.
తన లంకానగరిలో ప్రతిష్ఠించాలన్న తాపత్రయంతో దాన్ని పొందివున్నాడు రావణుడు.
వింధ్య పర్వతాల దగ్గర కొచ్చేసరికి, కారణాంతరాల వల్ల లింగాన్ని చేతుల్లోంచి దించవలసివచ్చి, సమీపంలోనే ఉన్న ఓ గొల్లపిల్ల వాడిని పిలిచి తాను వచ్చి తీసుకొనేదాకా ఆ లింగం చేతుల్లోనే ఉంచవలసిందని కోరాడు. ఈలోగా దేవతల ప్రేరణచే, ఆ గొల్లడు రావణుడు రాకుండానే దాన్ని నేలన పెట్టేశాడు.
ఇంకేమూందీ? అది అక్కడే ప్రతిష్ఠితం అయిపోయింది. పర్లి అనే ప్రాంతంలో ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ఠకు గొల్లని రూపంలో శ్రీకృష్ణుడే కారకుడని ఐతిహ్యం. ప్రత్యక్షంగా రోగనివారకుడై వైద్యనాధస్వామిగా అనుగ్రహిస్తున్నాడిక్కడ.
10. ద్వారక:
నాగనాధుడు లేక నాగేశ్వరుడుగా ద్వారకా పట్టణాన విరాజిల్లు తున్న పరమేశ్వర జ్యోతిర్లింగం పదవది.
దారుకుడనే రాక్షసుడి బారినుండి సుప్రియుడు అనే మహాశివార్చనాపరుని రక్షించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఇక్కడ. ఈ లింగార్చన వల్ల చక్రవర్తిత్వం సిద్ధిస్తుందని నలచక్రవర్తి నిరూపించాడు.
11. రామేశ్వరం :
త్రేతాయుగంలో రాముడు, రావణవధ అనంతరం, సేతుబంధనం చేసిన ప్రాంతంలో శివార్చన చేసి, జ్యోతిర్లింగ రూపంలో అక్కడే స్థిరుడిగా ఉండమని కోరగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు.
12. దేవగిరి:
దక్షిణాదిన దేవగిరి పర్వత సమీపంలో ఘశ్మ అనే మహా భక్తురాలి కోరికపై ఘశ్మేశ్వర లింగరూపుడైనాడా మహేశ్వరుడు".
..అని అయా జ్యోతిర్లింగాల విశేషాలను చెప్పిన సూతుడు, మరోసారి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చేసి, స్తోత్రపఠన ఫలితాన్ని ఈ విధంగా ఎరింగించాడు -
శ్లో.
ద్వాద శైతాని నామాని - ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వ పాప వినిర్ముక్తం - సర్వసిద్ధిప్రదం లభేత్ ||
యం యం కామ మపేక్ష్యైవ - పఠిష్యంతి నరోత్తమాః
ప్రాష్యంతి కామం తం తం హే - పరత్రేహ మునీశ్వరాః ||
ఏతేషాం పూజనే నైవ - వర్ణానాం దుఃఖనాశనం
ఇహలోకే పరత్రాపి - ముక్తిర్భవతి నిశ్చితం ||
ఉదయం మేల్కొంటూనే, ఇప్పుడు చెప్పుకున్న 12 జ్యోతిర్లింగాలను స్తోత్ర రూపాన గాని - నామరూపాన గాని భక్తితో తలచుకొనువారలు పాపాల నుండి విముక్తులవుతారు. ఎవరెవరు ఏ యే కోరికలతో ఇది పఠిస్తారో వారికాయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి. ఇక - ఆ జ్యోతిర్లింగాల దర్శనం, పూజ సిద్ధించిన వారికి ఇహలోకంలో సమస్తసంపదలు కలిగి, పరమునందు ముక్తి తథ్యం!
Subscribe to:
Posts (Atom)







































