The World Of Telugu Language, Telugu Culture, Telugu History, Telugu Temples and Tourism, Telugu Tradition, Telugu Cinema and Movies, Telugu Recipes, Telugu Magazines, Telugu Fashion, Telugu Ebooks, Telugu Men and Women, Telugu Kids, Telugu Art, Telugu Photos, Telugu Muggulu, Telugu Education, Telugu General Knowledge, Telugu Kavithalu, Telugu Cartoons and Telugu Jokes, Telugu Adult Education and many more.
ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.
Search This Blog
TWW FOLLOWERS
Showing posts with label Food Grains Health Tips. Show all posts
Showing posts with label Food Grains Health Tips. Show all posts
What Are the Benefits of Gingelly Oil? NUVVULA NUNE UPAYOGALU - HEALTH BENEFITS WITH NUVVULA NUNE
నువ్వులనూనె ఉపయోగాలు -
నువ్వులనూనె గుణాలు -
ఆయుర్వేద శాస్త్రవేత్తలు అయిన మన మహర్షులు అందరు నువ్వులనూనె యొక్క గొప్పతనాన్ని గుర్తించి దానికి తమతమ గ్రంథాలలో చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు.
నువ్వులనూనె కి వేడిచేసే స్వభావం ఉంది. వగరు,తీపి రుచులు కలిగి బలకరం అయిన వీర్యవర్ధకం అయిన గుణాలు కలిగి ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు , ద్రుడత్వానికి , నల్లదనానికి నువ్వులనూనె బాగా ఉపకరిస్తుంది. శరీరానికి నునుపు,కాంతిని ప్రసాదించి చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
నువ్వులనూనె వాడటం వలన కలుగు ప్రయోజనాలు -
నువ్వులనూనె మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి నిత్యం నువ్వులనూనె వాడుకోవాలి అని ఆయుర్వేద శాస్త్రకారులు తెలియజేసారు.
రెండు ముక్కు రంధ్రాలలో రెండురెండు చుక్కలు , రెండు చెవులలో రెండురెండు చుక్కలు నువ్వులనూనె వేసుకోవాలి అని సూచించారు. దీనివల్ల మెడపైన వచ్చే శిరొవ్యాధులు , నాసికావ్యాధులు , నేత్రవ్యాదులు , చెవివ్యాధులు , దంతవ్యాధులు మొదలయిన 231 రకాల వ్యాదులు నివారించ వచ్చు.
దీని యెక్క అర్దం ఆయా వ్యాధులు వచ్చాక నువ్వులనూనె వాడితే ప్రయోజనం ఉంటుంది అని కాదు. దీనిని వాడటం ఒక ఆచారంగా , ఒక అలవాటుగా వాడుతూ ఉంటే శిరస్సులో సర్వభాగాలు శక్తివంతం అయ్యి భవిష్యత్తులో ఏ రకమయిన తల వ్యాదులు రాకుండా కాపాడుకోవచ్చు అని ముందు జాగ్రత్తగా సూచించారు .
ఇలా వాడటం వలన భవిష్యత్తులో చెవులకు సంభందించిన చెవుడు , చెవిలో చీము , చెవిపోటు , చెవిహోరు వంటి వ్యాదులని , కంటి మసకలు , పొరలు , కంటి రెప్పల మీద వెంట్రుకలు ఉడిపోవడం వంటి నేత్రవ్యాధులను , దంతాలు పుచ్చిపోవడం , చిగుళ్లు నుంచి రక్తం కారడం , దంతాలు ఉడిపోవడం వంటి వ్యాదులని , సైనసైటిస్ , జలుబు, ఎడినాయిడ్స్ వంటి నాసికా వ్యాదుల్ని , ఆకాలంలో జుట్టు నెరవడం , జుట్టు ఉడటం , బట్టతల కావడం వంటి కేశవ్యాదులని , నత్తి , మూగతనం వంటి వ్యాదులని రాకుండా కాపాడుకోవచ్చు అని సదాశయంతో ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.
శుశ్రుతుడు తన శుశ్రుత సంహితలో నువ్వులనూనె గురించి చాలా వివరంగా వివరించారు. నువ్వులనూనె ని ఉపయోగించడం వలన వ్యాదులు రాకుండా ఉండటం తో పాటు కాలాలు , ఋతువులు మారినప్పుడు వాతావరణ భేదాల వలన ఆహారంలో తేడాల వలన వ్యాధులుగా పరిగణించ బోయే పరిస్థితి కూడా మారిపొతుంది అని చరక మహర్షి కూడా తెలియజేశారు .
చెవి, ముక్కు, గొంతుకు సంభందించిన సకల శరీర భాగాలను శక్తివంతం చేసే అద్బుత ప్రక్రియ నువ్వులనూనె వాడకం అని శుశ్రుతుడు తెలియజేసెను .
నోటి పరిమళానికి , దవడలు , దంతాలు , శిరస్సు, మెడకొంకులు , గొంతు,భుజాలు , వక్షస్తలం , వెంట్రుకలు మొదలయిన భాగాలు అన్ని ద్రుడతరంగా ఉండాలి అంటే నువ్వులనూనె ని నస్యం చేయక తప్పదు అని వక్కాణించారు.
నువ్వులనూనె గుణాలు -
ఆయుర్వేద శాస్త్రవేత్తలు అయిన మన మహర్షులు అందరు నువ్వులనూనె యొక్క గొప్పతనాన్ని గుర్తించి దానికి తమతమ గ్రంథాలలో చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు.
నువ్వులనూనె కి వేడిచేసే స్వభావం ఉంది. వగరు,తీపి రుచులు కలిగి బలకరం అయిన వీర్యవర్ధకం అయిన గుణాలు కలిగి ఉంటుంది. వెంట్రుకల పెరుగుదలకు , ద్రుడత్వానికి , నల్లదనానికి నువ్వులనూనె బాగా ఉపకరిస్తుంది. శరీరానికి నునుపు,కాంతిని ప్రసాదించి చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.
నువ్వులనూనె వాడటం వలన కలుగు ప్రయోజనాలు -
నువ్వులనూనె మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి నిత్యం నువ్వులనూనె వాడుకోవాలి అని ఆయుర్వేద శాస్త్రకారులు తెలియజేసారు.
రెండు ముక్కు రంధ్రాలలో రెండురెండు చుక్కలు , రెండు చెవులలో రెండురెండు చుక్కలు నువ్వులనూనె వేసుకోవాలి అని సూచించారు. దీనివల్ల మెడపైన వచ్చే శిరొవ్యాధులు , నాసికావ్యాధులు , నేత్రవ్యాదులు , చెవివ్యాధులు , దంతవ్యాధులు మొదలయిన 231 రకాల వ్యాదులు నివారించ వచ్చు.
దీని యెక్క అర్దం ఆయా వ్యాధులు వచ్చాక నువ్వులనూనె వాడితే ప్రయోజనం ఉంటుంది అని కాదు. దీనిని వాడటం ఒక ఆచారంగా , ఒక అలవాటుగా వాడుతూ ఉంటే శిరస్సులో సర్వభాగాలు శక్తివంతం అయ్యి భవిష్యత్తులో ఏ రకమయిన తల వ్యాదులు రాకుండా కాపాడుకోవచ్చు అని ముందు జాగ్రత్తగా సూచించారు .
ఇలా వాడటం వలన భవిష్యత్తులో చెవులకు సంభందించిన చెవుడు , చెవిలో చీము , చెవిపోటు , చెవిహోరు వంటి వ్యాదులని , కంటి మసకలు , పొరలు , కంటి రెప్పల మీద వెంట్రుకలు ఉడిపోవడం వంటి నేత్రవ్యాధులను , దంతాలు పుచ్చిపోవడం , చిగుళ్లు నుంచి రక్తం కారడం , దంతాలు ఉడిపోవడం వంటి వ్యాదులని , సైనసైటిస్ , జలుబు, ఎడినాయిడ్స్ వంటి నాసికా వ్యాదుల్ని , ఆకాలంలో జుట్టు నెరవడం , జుట్టు ఉడటం , బట్టతల కావడం వంటి కేశవ్యాదులని , నత్తి , మూగతనం వంటి వ్యాదులని రాకుండా కాపాడుకోవచ్చు అని సదాశయంతో ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.
శుశ్రుతుడు తన శుశ్రుత సంహితలో నువ్వులనూనె గురించి చాలా వివరంగా వివరించారు. నువ్వులనూనె ని ఉపయోగించడం వలన వ్యాదులు రాకుండా ఉండటం తో పాటు కాలాలు , ఋతువులు మారినప్పుడు వాతావరణ భేదాల వలన ఆహారంలో తేడాల వలన వ్యాధులుగా పరిగణించ బోయే పరిస్థితి కూడా మారిపొతుంది అని చరక మహర్షి కూడా తెలియజేశారు .
చెవి, ముక్కు, గొంతుకు సంభందించిన సకల శరీర భాగాలను శక్తివంతం చేసే అద్బుత ప్రక్రియ నువ్వులనూనె వాడకం అని శుశ్రుతుడు తెలియజేసెను .
నోటి పరిమళానికి , దవడలు , దంతాలు , శిరస్సు, మెడకొంకులు , గొంతు,భుజాలు , వక్షస్తలం , వెంట్రుకలు మొదలయిన భాగాలు అన్ని ద్రుడతరంగా ఉండాలి అంటే నువ్వులనూనె ని నస్యం చేయక తప్పదు అని వక్కాణించారు.
HEALTH BENEFITS WITH ALL KITCHEN ITEMS
ఔషధం కానిదేదీ ఈ జగత్తులో లేదు..!
ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. ఈ నేపథ్యంలో అందరికీ పరిచయం ఉండి, సులభంగా అందుబాటులో ఉండే మొక్కలు, వాటిలో ఆరోగ్య విలువలను తెలియచేయడం ద్వారా సాధారణ ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణోపాయాలు తెలియచేస్తున్నాం. ఆహార ధాన్యాలన్నింటికీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి.
• ఆహార ధాన్యాలు - ఔషధీ విలువలు
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, కుసుమ వ్యాధులను నివారిస్తాయి.
గోధుమలు - పుష్టినిస్తాయి. జ్వరంలో వాడతగినవి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
రాగులు - పుష్టినిస్తాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు మంచిది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి
జొన్నలు- మధుమేహం కలవారికి మంచి ఆహారం.ఎండాకాలంలో తక్షణ శక్తి ఇస్తుంది.
కందులు - పుష్టినిస్తాయి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
పెసర్లు - పప్పు ధాన్యాలు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేస్తుంది.
మినుములు - వీర్యవృద్ధిని, మూత్రపిండాలకు బలము కలుగచేస్తుంది.
శనగలు - స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కడుపులో క్రిములను చంపుతుంది. నూనెతో వేయించి తనడం మంచిది కాదు. సౌల్యం ఉన్నవారు తినరాదు.
ఉలువలు - మూత్రంలో రాళ్ళు, క్షయ, అతి మూత్రం, రుతుబద్ధతను తగ్గిస్తాయి.
వేరుశనగలు - చిన్న పిల్లలకు పుష్టికరం. మొలకలు తీసి వాడాలి. శరీర పుష్టిని కలిగిస్తుంది.
బఠాణీలు - శరీర పుష్టిని కలిగిస్తాయి
మసూరపప్పు - విరోచనాలు, అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది.
నువ్వులు - వీర్యవృద్ధిని, చర్మ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పండ్లను గట్టి పరుస్తుంది, ఋతు బద్ధాన్ని విప్పుతుంది.
అలసందలు- స్తన్యవృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
• కాయగూరలు - ఔషధీ విలువలు
తోటకూర/ పెరుగు తోట కూర - స్ర్తీలలో ఎర్రబట్ట, ఆర్శమొలలు,వాతవ్యాధులు నివారించబడతాయి.
పుదీనా - అజీర్ణాన్ని తొలగించి ఆకలిని కలిగించును.
కొత్తిమీర - ఆకలిని కలిగించును, నోటిపూత, పంటినొప్పి, మానసిక వత్తిడిని నిర్మూలిస్తుంది.
కరివేపాకు - జిగట విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గిస్తుంది.
పొన్నగంటికూర - నేత్ర వ్యాధులు కలవారికి, కడుపులో క్రిములు కలవారికి మేలు చేస్తుంది.
అవిశ ఆకు - రేచీకటి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
మునగాకు, కాయ - చెవి వ్యాధులు, ఆర్శ మొలలు తగ్గిస్తుంది. స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది.
ముల్లంగి - దుంపలలో ఉత్తమమైనది, మూత్రములో రాళ్ళు పుట్టకుండా చేస్తుంది.
గాజర - రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది.
కంద - ఆర్శ మొలలు, కడుపులో క్రిములు కలవారికి మంచిది.
అరటికాయలు - శిశువులలో అజీర్ణం, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. ఆయువును పెంచుతుంది. కడుపులో పుండ్లను మాన్పుతుంది.
బూడిద గుమ్మడి - శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. మూత్రంలో రాళ్ళు, జిగట విరేచనాలు తగ్గిస్తుంది.
అల్లం - ఆకలి కలిగిస్తుంది. అజీర్ణం, జలుబు తగ్గిస్తుంది.
ఉల్లి (నీరుల్లి) - ఆకలి కలిగిస్తుంది. వడదెబ్బ తొలిగిస్తుంది.
కాకరకాయలు - మధుమేహం, కడుపులో క్రిములు తగ్గిస్తుంది.
కామంచికూర - కడుపులో క్రిములు, హృదయరోగాలు గలవారు వాడదగినది.
బీరకాయలు - వేడిని తగ్గిస్తుంది. అన్ని రకాల వ్యాధులకు పథ్యం.
కొబ్బరికాయ - పుష్టినిస్తుంది, వడదెబ్బను అలసటను పోగొడుతుంది.
చింతపండు- వాతవ్యాధులు, మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది. సంవత్సరం పాతది మంచిది.
చింతచిగురు - ఆర్శ మొలలు కలవారికి మంచిది.
మెంతికూర - వేడిని, ఆర్శమొలలను, మధుమేహం, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
పాలకూర - పొట్టలో జబ్బులు కలవారికి మంచిది.
చుక్కకూర - ఆకలిని కలిగిస్తుంది. కీళ్ళ నొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి - ఆకలిని పెంచుతుంది. జ్వరం కలవారు తినరాదు.
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.
వంకాయలు- ఆకలిని, రక్తాన్ని వృద్ధి చేస్తాయి. లేతవి మేలు.
చిలగడ దుంపలు- వేడిని తగ్గిస్తాయి. రక్త వృద్ధి చేస్తాయి.
సొరకాయ - రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది.
పచ్చి మిరపకాయలు - ఎక్కువగా తింటే వీర్య నష్టం కలుగుతుంది.
పొట్లకాయ - అందరు రోగులకు మంచిది. వీర్యపుష్టిని కలిగిస్తుంది
బుడ్డ కాకర కాయ - ఆకలిని కలిగిస్తుంది. చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు తగ్గిస్తుంది.
చామకూర- ఆర్శ మొలలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చామదుంపలు -మూత్రపిండాలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఆలుగడ్డలు - పుష్టికరం, బలకరం, ఎక్కువగా తినరాదు.
ఇంకా మనం వంటలో ఉపయోగించే పదార్ధాలనేకంలో పోషక విలువలు ఉంటాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారం మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అది పప్పు ధాన్యాలైనా, కాయగూరలైనా, పళె్ళైనా, వంట దినుసులైనా, మూలికలైనా. అయితే ఈ ఆహారాన్ని కూడా మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు.
ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. ఈ నేపథ్యంలో అందరికీ పరిచయం ఉండి, సులభంగా అందుబాటులో ఉండే మొక్కలు, వాటిలో ఆరోగ్య విలువలను తెలియచేయడం ద్వారా సాధారణ ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణోపాయాలు తెలియచేస్తున్నాం. ఆహార ధాన్యాలన్నింటికీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి.
• ఆహార ధాన్యాలు - ఔషధీ విలువలు
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, కుసుమ వ్యాధులను నివారిస్తాయి.
గోధుమలు - పుష్టినిస్తాయి. జ్వరంలో వాడతగినవి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
రాగులు - పుష్టినిస్తాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు మంచిది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి
జొన్నలు- మధుమేహం కలవారికి మంచి ఆహారం.ఎండాకాలంలో తక్షణ శక్తి ఇస్తుంది.
కందులు - పుష్టినిస్తాయి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
పెసర్లు - పప్పు ధాన్యాలు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేస్తుంది.
మినుములు - వీర్యవృద్ధిని, మూత్రపిండాలకు బలము కలుగచేస్తుంది.
శనగలు - స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కడుపులో క్రిములను చంపుతుంది. నూనెతో వేయించి తనడం మంచిది కాదు. సౌల్యం ఉన్నవారు తినరాదు.
ఉలువలు - మూత్రంలో రాళ్ళు, క్షయ, అతి మూత్రం, రుతుబద్ధతను తగ్గిస్తాయి.
వేరుశనగలు - చిన్న పిల్లలకు పుష్టికరం. మొలకలు తీసి వాడాలి. శరీర పుష్టిని కలిగిస్తుంది.
బఠాణీలు - శరీర పుష్టిని కలిగిస్తాయి
మసూరపప్పు - విరోచనాలు, అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది.
నువ్వులు - వీర్యవృద్ధిని, చర్మ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పండ్లను గట్టి పరుస్తుంది, ఋతు బద్ధాన్ని విప్పుతుంది.
అలసందలు- స్తన్యవృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
• కాయగూరలు - ఔషధీ విలువలు
తోటకూర/ పెరుగు తోట కూర - స్ర్తీలలో ఎర్రబట్ట, ఆర్శమొలలు,వాతవ్యాధులు నివారించబడతాయి.
పుదీనా - అజీర్ణాన్ని తొలగించి ఆకలిని కలిగించును.
కొత్తిమీర - ఆకలిని కలిగించును, నోటిపూత, పంటినొప్పి, మానసిక వత్తిడిని నిర్మూలిస్తుంది.
కరివేపాకు - జిగట విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గిస్తుంది.
పొన్నగంటికూర - నేత్ర వ్యాధులు కలవారికి, కడుపులో క్రిములు కలవారికి మేలు చేస్తుంది.
అవిశ ఆకు - రేచీకటి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది.
మునగాకు, కాయ - చెవి వ్యాధులు, ఆర్శ మొలలు తగ్గిస్తుంది. స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది.
ముల్లంగి - దుంపలలో ఉత్తమమైనది, మూత్రములో రాళ్ళు పుట్టకుండా చేస్తుంది.
గాజర - రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది.
కంద - ఆర్శ మొలలు, కడుపులో క్రిములు కలవారికి మంచిది.
అరటికాయలు - శిశువులలో అజీర్ణం, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. ఆయువును పెంచుతుంది. కడుపులో పుండ్లను మాన్పుతుంది.
బూడిద గుమ్మడి - శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. మూత్రంలో రాళ్ళు, జిగట విరేచనాలు తగ్గిస్తుంది.
అల్లం - ఆకలి కలిగిస్తుంది. అజీర్ణం, జలుబు తగ్గిస్తుంది.
ఉల్లి (నీరుల్లి) - ఆకలి కలిగిస్తుంది. వడదెబ్బ తొలిగిస్తుంది.
కాకరకాయలు - మధుమేహం, కడుపులో క్రిములు తగ్గిస్తుంది.
కామంచికూర - కడుపులో క్రిములు, హృదయరోగాలు గలవారు వాడదగినది.
బీరకాయలు - వేడిని తగ్గిస్తుంది. అన్ని రకాల వ్యాధులకు పథ్యం.
కొబ్బరికాయ - పుష్టినిస్తుంది, వడదెబ్బను అలసటను పోగొడుతుంది.
చింతపండు- వాతవ్యాధులు, మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది. సంవత్సరం పాతది మంచిది.
చింతచిగురు - ఆర్శ మొలలు కలవారికి మంచిది.
మెంతికూర - వేడిని, ఆర్శమొలలను, మధుమేహం, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
పాలకూర - పొట్టలో జబ్బులు కలవారికి మంచిది.
చుక్కకూర - ఆకలిని కలిగిస్తుంది. కీళ్ళ నొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి - ఆకలిని పెంచుతుంది. జ్వరం కలవారు తినరాదు.
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది.
వంకాయలు- ఆకలిని, రక్తాన్ని వృద్ధి చేస్తాయి. లేతవి మేలు.
చిలగడ దుంపలు- వేడిని తగ్గిస్తాయి. రక్త వృద్ధి చేస్తాయి.
సొరకాయ - రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది.
పచ్చి మిరపకాయలు - ఎక్కువగా తింటే వీర్య నష్టం కలుగుతుంది.
పొట్లకాయ - అందరు రోగులకు మంచిది. వీర్యపుష్టిని కలిగిస్తుంది
బుడ్డ కాకర కాయ - ఆకలిని కలిగిస్తుంది. చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు తగ్గిస్తుంది.
చామకూర- ఆర్శ మొలలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
చామదుంపలు -మూత్రపిండాలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఆలుగడ్డలు - పుష్టికరం, బలకరం, ఎక్కువగా తినరాదు.
ఇంకా మనం వంటలో ఉపయోగించే పదార్ధాలనేకంలో పోషక విలువలు ఉంటాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారం మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అది పప్పు ధాన్యాలైనా, కాయగూరలైనా, పళె్ళైనా, వంట దినుసులైనా, మూలికలైనా. అయితే ఈ ఆహారాన్ని కూడా మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)






















